'డీఆర్ఎస్' అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం. ఇప్పటివరకూ బ్యాటర్ ఎల్ బీడబ్ల్యూగా ఔటైన సందర్భంలో మాత్రమే డీఆర్ఎస్ కోరేవారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం.. కానీ, మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వైడ్, నో బాల్కి కెప్టెన్లు సమీక్ష కోరుతున్నారు. దీంతో ఏం జరుగుతోందా! అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అందుకు కారణ.. ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని సంధర్భాల్లో అంపైర్లు ఇచ్చే తప్పుడు నిర్ణయాలు చాలా తీవ్ర వివాదాస్పదమవుతుంటాయి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంటాయి. ఔట్ ని నాటౌట్ అని, నాటౌట్ ని ఔట్ అని.. గుడ్డిగా నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు మీరూ బోలెడు చూసే ఉంటారు.. వీళ్లకు కళ్లు కనిపించవా..? అని మనుసులో అనుకొని ఉంటారు. రాను.. రాను.. అలాంటి తప్పుడు నిర్ణయాలు అధికమవుతున్నాయి. చెప్పుకోవడానికి అదొక చిన్న సందర్భమే అయినా కొన్ని నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంటాయి.. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. మహిళల ప్రీమియర్ లీగ్ నుండి కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆటగాళ్లు, వైడ్, నో బాల్ వంటి వాటిపై కూడా సమీక్ష కోరవచ్చు.
ఐపీఎల్ 2022 సీజన్లో చోటుచేసుకున్న ‘నో బాల్’ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచులో అంపైర్ ‘నో బాల్’ ఇవ్వకపోవడంపై ఢిల్లీ సారథి రిషబ్ పంత్, తమ ఆటగాళ్లను క్రీజు వదిలి వచ్చేయాలంటూ సందేశాలు జారీ చేస్తాడు. ఆ కారణంగా మ్యాచుకు దాదాపు 10 నిమిషాల పాటు అంతరాయం కలుగుతుంది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అంపైర్లు, రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వస్తాయి. దీనంతటికి కారణం.. అప్పటి వరకూ ‘నో బాల్’ కు సమీక్ష కోరే అవకాశం లేకపోవడం. అంటే.. అంపైర్ ఒకసారి నో బాల్గా ప్రకటించినా లేదా నో బాల్గా కాదన్నా తరవాత ప్లేయర్లు ఏమీ చేయలేరు.
Rishabh Pant ne thik kiya. Worst umpiring. 😠 #DCvRR pic.twitter.com/BUmVOo3S1k
— Sushanta Acharjee (@SushantaIM) April 22, 2022
కానీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో వైడ్ కి, నో బాల్కి ‘డీఆర్ఎస్’ రివ్యూ కోరే వెసులుబాటు కల్పించింది బీసీసీఐ. అంపైర్ల నిర్ణయాలను ఛాలెంజ్ చేసేందుకు ప్రతి జట్టుకు మూడు డీఆర్ఎస్ రివ్యూలు అందుబాటులో ఉంటాయి. అంపైర్ వైడ్ ఇవ్వకపోయినా, నో బాల్ ఇవ్వకపోయినా సదరు బ్యాటర్ డీఆర్ఎస్ కోరవచ్చు. అనంతరం థర్డ్ అంపైర్, దానిని పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తాడు. తాజాగా , యూపీ వారియర్స్-గుజరాజ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో యూపీ ప్లేయర్ గ్రేస్ హారీస్ ఈ విధంగా డీఆర్ఎస్ కోరి మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
A game changing review for the wide – Grace Harris has done it for UP Warriorz. pic.twitter.com/GHOvagU1nR
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2023
మ్యాచ్ ఆఖరి ఓవర్లో విజయానికి 3 బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా, హారీస్ వైడ్ పై సమీక్ష కోరి ఒక విలువైన పరుగును సాధిస్తుంది. దీంతో ఒక పరుగు తక్కువ కావడమే కాకుండా, అదనపు బంతి ప్రయోజనం చేకూరుతుంది. దీంతో అప్ విజయం సులభతరమవుతుంది. ఇదే రూల్ని పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లోనూ అమలు చేయబోతున్నారు. బంతి బంతికి రిజల్ట్ మారిపోయే పొట్టి క్రికెట్లో ప్రతీ పరుగు ఎంతో విలువైనదే. అలాంటి సమయాల్లో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ రిజల్ట్నే మార్చేయొచ్చు.అందుకే ఈ సీజన్లో వీటికి కూడా డీఆర్ఎస్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వైడ్, నో బాల్కి DRS రివ్యూ కోరడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Excellent use of technology to review the waist high no-ball & wide.
Need this in IPL. pic.twitter.com/wjbIBbWzvE
— Johns. (@CricCrazyJohns) March 5, 2023