టీమిండియా మాజీ సారధి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ టీ20 టోర్నీ ప్రిపరేషన్స్ షురూ చేశాడు. విమర్శలు, విశ్రాంతి అన్ని అయిపోయాక తీరిగ్గా.. మూడు వారాల అనంతరం ట్రెయినింగ్ మొదలు పెట్టాడు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ఎస్సీఏ ఇండోర్ అకాడమీలో విరాట్ ట్రెయినింగ్ మొదలైంది. సరైన ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ కీలకమ్ కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కాలంటే.. ఇక్కడ రాణించడం చాలా అవసరం.
సెంచరీ చేయక రెండేళ్లు ధాటి పోవడంతో ఈ సిరీస్లోనైనా సెంచరీ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు పాకిస్తాన్ తో జరగబోయే టీ20 మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్లో వందవది కావడం విశేషం. దీంతో వందో మ్యాచ్లోనైనా కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆకలిగొన్న పులి ఎలా ఘర్జిస్తుందో.. అదే రీతిలో పరుగులు తీస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Virat Kohli during practice session #ViratKohli | #ViratKohli𓃵 | #KingKohli pic.twitter.com/z80t0wlfn1
— Mufaddal Vohra (@Musafir_hu_yr) August 11, 2022
ఇక, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఆసియా కప్ కోసం ఈనెల 20న దుబాయ్ బయల్దేరనుంది. అంతకుముందే ప్లేయర్లంతా ఈనెల 18న ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్కు హాజరుకానున్నారు. అనంతరం దుబాయ్లో మూడు రోజుల ట్రెయినింగ్ క్యాంప్లో పాల్గొంటారు. ఆసియాకప్లో భాగంగా ఈనెల 28న జరిగే తొలి మ్యాచ్లో ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోటీ పడనుంది.
ఇక.. ఆసియాకప్ టోర్నీకి సర్వం సిద్దమైంది. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 6 జట్లు పాల్గొంటాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా.. 6వ జట్టు క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాలి. ఇక క్వాలిఫయర్ రౌండ్లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పోటీపడతాయి. ఇందులో టాప్ లో నిలిచిన జట్టు 6వ టీంగా ఆసియాకప్ లో పాల్గొంటుంది. క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్లు ఆగస్టు 20- 26 మధ్య నిర్వహించనున్నారు.
టోర్నీ ఫార్మాట్..
ఆసియా కప్ లో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో భారత్, పాకిస్థాన్ తో పాటు క్వాలిఫయర్ జట్టు ఉంటాయి.అలాగే.. గ్రూప్ -Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి టీం తమ గ్రూప్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లో టాప్ రెడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్ రౌండ్కు క్వాలిఫై అవుతాయి. సూపర్ 4లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఆసియాకప్ ఫైనల్కు వెళ్తాయి. ఫైనల్లో గెలిచిన జట్టు టైటిల్ ను దక్కించుకుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
🚨 India’s squad for the Asia Cup 2022 has been announced. Sanju Samson, Ishan Kishan miss out while Virat Kohli and KL Rahul return to the side. pic.twitter.com/eVTrIksNeb
— 100MB (@100MasterBlastr) August 8, 2022
టైటిల్ ఫేవరేట్ గా భారత్..
ఆసియాకప్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే.. ఈ టోర్నీలో భారత జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి టీమిండియానే ఫేవరెట్ గా ఆడబోతుంది. సర్వేలు సైతం.. ఆసియాకప్ గెలిచే అవకాశాలు భారత్ కే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాయి. భారత్ 42%, పాకిస్థాన్ 34%, శ్రీలంక 12%, బంగ్లాదేశ్ 6%, ఆఫ్ఘనిస్థాన్ 4%, యూఏఈ 2% విజయవకాశాలున్నాయని సర్వేలో తేలింది. ఆసియా కప్ టోర్నీ ఎవరి సొంతమవుతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంత్పై ఊర్వశి రౌతెలా సంచలన కామెంట్స్..! అతనో ‘కౌగర్ హంటర్’
ఇదీ చదవండి: Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్
Will we witness India vs Pakistan final in the Asia Cup 2022?#AsiaCup #India #Pakistan #INDVPAK #Cricket #CricTracker #T20 pic.twitter.com/1E0OGWMaTQ
— CricTracker (@Cricketracker) August 5, 2022