బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాపై టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పరోక్షంగా మండిపడ్డాడు. కొంతమంది ఫేమ్, పాపులారిటీ కోసం అబద్దాలతో ఎంత నీచానికైనా దిగజారుతారని పేర్నొన్నాడు. కాగా పంత్.. ఊర్వశి రౌతెలాను ఉద్దేశిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఊర్వశిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసి, కొద్ది రోజులకే ఇషా నేగి అనే మోడల్తో తాను ప్రేమలో ఉన్నట్లు పంత్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీంతో ఊర్వశికి, పంత్కు మధ్య ఏం లేదని అంతా భావించారు. కానీ.. ఊర్వశి మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా మాట్లాడుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంత్ పేరు ప్రస్తావించకుండా.. మిస్టర్ ఆర్పీ అని పేర్కొంటూ పంత్తో తనకు ఎక్కడ చెడిందో ఊర్వశి బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. 'వారణాసిలో ఓ మూవీ షూటింగ్లో పాల్గొని.. ఓ షోలో పాల్గొనేందుకు ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాను. ఢిల్లీలో రోజంతా షూటింగ్లో పాల్గొని.. మళ్లీ ఆ తర్వాతి రోజు వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను(రిషభ్ పంత్) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు అతను వచ్చిన విషయం తెలియదు. అతను వచ్చే పది నిమిషాల ముందే నేను షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చి హోటల్ గదిలో ఒళ్లు తెలియకుండా.. మత్తుగా నిద్రపోయాను. ఫోన్ మోగుతున్నా.. నిద్రలో ఉన్న నాకు ఫోన్ రింగ్ మినిపించలేదు. అంతలా అలిసిపోయి పడుకున్నా. లేచి చూసేసరికి ఏకంగా 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ అతను చేసినవే. నా కోసం అతను అంతలా వెయిట్ చేశాడా అని చాలా ఫీల్ అయ్యా. తిరిగి వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబైకి వెళ్లినప్పుడు అతన్ని కలిశాను. అంత బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు.. అతను నాతో మాట్లాడటం తగ్గించేశాడు. మా ఇద్దరి గురించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇది కూడా మా మధ్య దూరం పెరిగేందుకు కారణమైంది.’ అంటూ ఊర్వశి తమ బ్రేకప్కు గల కారణాన్నిచెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతెలా చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ మారింది. దీంతో పంత్ ఊర్వశి మధ్య ఇంత జరిగిందా.. ముంబైలో ఇద్దరు ఎందుకు కలిశారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. దీంతో రిషభ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా తీవ్రంగా స్పందించాడు. 'కొంతమంది ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో హెడ్లైన్స్ అవ్వడానికి ఇలా చేస్తారంటే చాలా ఫన్నీగా ఉంది. పేరు, ఫేమ్ కోసం తపించిపోయే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి.' అని ఇన్స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు. దీంతో ఊర్వశి తన గురించి చెప్పిందంతా అబద్ధమంటూ పంత్ చెప్పకనే చెప్పినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/oOIzZ4o61l — Sayyad Nagpasha (@SayyadNagpasha) August 11, 2022 View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) ఇది కూడా చదవండి: ప్రియురాలితో విడిపోయిన రిషబ్ పంత్! ఇంత గొడవ జరిగిందా?