టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు సౌరవ్ గంగూలీ చేసిందానితో పోలిస్తే విరాట్ కోహ్లి చేసింది చాలా తక్కువని చెప్పాడు. కెప్టెన్ గా గంగూలీ.. కొత్త భారత జట్టును నిర్మించాడని, కానీ కోహ్లి అలా చేశాడా..? అని ప్రశ్నించాడు. ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అంగీకరిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
‘గంగూలీ కొత్త భారత జట్టును నిర్మించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడు. ఆటగాళ్లు ఉన్నతంగా ఆడినప్పుడైనా.. ఫామ్ లో లేనప్పుడైనా వారికి మద్దతుగా నిలిచేవాడు. విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు అలా చేశాడా..? ఏమో నాకు డౌటే’ అని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగని సెహ్వాగ్.. ‘నా అభిప్రాయం ప్రకారం నెంబర్ వన్ కెప్టెన్ అనే వ్యక్తి జట్టును నిర్మించడమే గాక జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నమ్మకం కల్పించాలి. కోహ్లి కొంతమంది ఆటగాళ్లకే మద్దతుగా నిలిచాడు. చాలా మందిని అతడు పట్టించుకోలేదు’ అని తెలిపాడు.
గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంతో పోలిస్తే.. టీమిండియా ప్రస్తుతం కాస్త దూకుడు పెంచిందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే.. భారత జట్టుకు దూకుడు నేర్పిందే గంగూలీ అంటారు. గంగూలీ సారథి కాకముందు భారత జట్టులోని ఏ ఆటగాడినైనా స్లెడ్జింగ్ చేసినా చూసీ చూడనట్టు ఉండేవాళ్లు. కానీ గంగూలీ సారథి అయ్యాక.. ‘మాటకు మాట..’ అనే సిద్ధాంతాన్ని టీమిండియా వంటబట్టించుకుంది. ధోని, వీరూ, ఇర్ఫాన్ పఠాన్ వంటి గొప్ప క్రికెటర్లంతా ధోని హయాం లో టీమిండియాలోకి వచ్చినోళ్లే.
“In my opinion, the #1 captain is the one who builds a team and gives confidence to his players. He (Kohli) backed some players, some he did not.”
Virender Sehwag has expressed his thoughts on Virat Kohli’s captaincy tenure 👀#SouravGanguly #ViratKohli #Cricket #IPL2022 pic.twitter.com/m0J9pw9VWs
— Wisden India (@WisdenIndia) May 19, 2022
ఇది కూడా చదవండి: T20 World Cup 2022: గంగూలీ మనసులో 2007 వరల్డ్ కప్ నాటి ఫార్ములా! సీనియర్స్ కి షాక్ తప్పదా?
ఈ ఇద్దరూ భారత జట్టుకు గొప్ప కెప్టెన్లే అయినప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. గంగూలీ భారత జట్టు పగ్గాలు చేపట్టాక 2002లో ఐసీసీ నాకౌట్ దశకు వెళ్లింది టీమిండియా. రెండేండ్ల తర్వాత 2004లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి ట్రోఫీని పంచుకుంది. 2003 వన్డే ప్రపంచకప్ లో ఫైనల్ కు వెళ్లింది. ఇవే గంగూలీ కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ గొప్ప సంఘటనలు. మరోవైపు.. కోహ్లికి కూడా ఐసీసీ ఈవెంట్లలో గొప్ప రికార్డు ఏమీలేవు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ.. పాక్ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్. ఇక.. 2021 లో టీ20 ప్రపంచకప్ అయితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఒకరకంగా కోహ్లి మీదున్న అతిపెద్ద విమర్శ.. “ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు కప్ కొట్టలేదు” అన్నదే. అయితే ఐసీసీ ఈవెంట్లలో ఎలా ఉన్నా టెస్టులలో మాత్రం కోహ్లి.. భారత జట్టును జగజ్జేతగా నిలిపాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను రెండు పర్యాయాలు ఓడించడం.. టెస్టులలో చాలాకాలం పాటు టీమిండియాను నెంబర్ వన్ గా నిలపడం వంటి ఘనతలు చాలా ఉన్నాయి.
Guy Literally Gave Everything he could give to Team India in Test Format.. 💔
Took india from 7th position in Tests to the Number 1..A Great Legacy comes to an End with 40 Wins in Test format.
Will Always be my GOAT Captain🐐@imVkohli#ViratKohli pic.twitter.com/NwgoWlOTSH
— Cric-Crazy Lad 🎭 (@CricCrazyLad) January 15, 2022