వరుస వైఫల్యాల తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన అంజిక్యా రహానే.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. జాతీయ జట్టులో స్థానంలో కోల్పోవడంతో దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్-వెస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్లో వెస్ట్ జోన్కు ఆడుతూ రహానే డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ డబుల్ సెంచరీలో ఏకంగా 18 ఫోర్లతో పాటు 6 సిక్సులు బాదడం విశేషం. మొత్తం 264 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సులతో 207 పరుగులు చేశాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్ కూడా డబుల్ సెంచరీతో చెలరేగాడు. 321 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సులతో 228 పరుగులు చేశాడు.
వీరిద్దరూ చెలరేగడంతో వెస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 590 పరుగులు చేసింది. ఇదే మ్యాచ్లో ఓపెనర్ పృథ్వీ షా కూడా సెంచరీతో రాణించాడు. 121 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో పృథ్వీషా 113 పరుగులు చేశాడు. కాగా.. టీమిండియా టెస్టు టీమ్లో అంజిక్యా రహానే, చతేశ్వర్ పుజారా కీలక ప్లేయర్లుగా ఎదిగారు. కానీ.. గత కొంత కాలం ఫూర్ ఫామ్తో ఇద్దరూ జట్టులో చోటు కోల్పోయారు. తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు పుజారా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ను వేదికగా చేసుకుంటే.. రహానే దేశవాళీ టోర్నీని ఎంచుకున్నాడు. వేదికలు వేరైనా.. ఇద్దరూ ఫామ్లోకి రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ ఫామ్లో ఉంటే.. టెస్టుల్లో టీమిండియా భీకరంగా మారుతుంది. మరి రహానే డబుల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yesterday Kohli and today rahane.
I am breathing fresh air again.#AjinkyaRahane @ajinkyarahane88 pic.twitter.com/rFQ85SfdBD— Naveen_ (@naveensharma024) September 9, 2022
Ajinkya Rahane brings up his 5⃣0⃣
West Zone 304/1 after 64 overs.
Live – https://t.co/ClJOcCNiBQ pic.twitter.com/Yl1Uyz5K7r
— Sportstar (@sportstarweb) September 9, 2022