టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ని టీడీపీలోకి ఆహ్వానించారు కాసాని. ఆ వివరాలు..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరి.. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి కి అనూహ్యం ఆహ్వానం లభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ చేతికి అప్పగించిన తర్వాత పార్టీ కేడర్లో కాస్త ఆశలు చిగురించాయి. ఇక తెలగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరుగుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. కార్యకర్తల్లో ఉత్సాహం, నమ్మకం కలిగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రేవంత్ రెడ్డిని తిరిగి టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆవివరాలు..
టీడీపీలోకి రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పార్టీలోకి తిరిగి రావాలని ఆయన కోరారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తనకు అమ్మ లాంటిది అని.. ఆ పార్టీపై తన ప్రేమ ఎప్పటికీ పోదని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాసాని స్పందిస్తూ.. తల్లి లాంటి టీడీపీ పార్టీపై ప్రేమ ఉందని రేవంత్ అన్నారని, రేవంత్ గనక పార్టీలోకి తిరిగి వస్తే ఆయనకు సాదర స్వాగతం పలుకుతామని కాసాని స్పష్టం చేశారు. అలానే ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. పొత్తులపై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని, ఎన్నికల సమయంలో తుది నిర్ణయం తీసుకుంటామని కాసాని స్పష్టం చేశారు. త్వరలో టీటీడీపీ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ నియామకం జరుపుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించనున్నట్లు కాసాని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై స్పందించారు. పొత్తులపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తుల అంశం తన పరిధిలో ఉండదని, ఢిల్లీ హైకమాండ్ ఆదేశాలను తాము పాటిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకత్వం తరపున తాము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని.. పొత్తుల అంశంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తాజాగా కాసాని వ్యాఖ్యలతో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై కొత్త ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం రేవంత్ హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇక పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్ ముందుకెళ్తున్నారు. మరి కాసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.