కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి - ధార్వాడ్ జిల్లాలలో ప్రధాని.. రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో ప్రధాని రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి – ధార్వాడ్ జిల్లాలలో ప్రధాని.. రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో ప్రధాని రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు. ముందుగా కర్ణాటకకు చేరుకున్న ప్రధాని మోడీ.. మాండ్యాలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు, స్థానికులు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు.
రెండు నెలలలో కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ బలంగా ఉన్న ఏరియాలలో మోదీ రోడ్ షో ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హుబ్బలి – ధార్వాబ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపనలు చేయనున్నారు మోడీ. అనంతరం బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వే ప్రారంభిస్తారు. 118 కి.మీ పొడవైన ఈ ప్రాజెక్ట్ ని మొత్తం రూ.8,480 కోట్లతో అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఈ ఎక్స్ ప్రెస్ వేతో బెంగళూరు, మైసూరు మధ్య జర్నీ టైమ్ దాదాపు మూడు గంటల వరకు సేవ్ అవుతుందని అధికారులు తెలిపారు. ఇక మాండ్యాలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత మోడీ ధార్వాడ్ లో రూ.850 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన IIT ధార్వాడ్ ను ప్రారంభిస్తారు. ఈ ఇనిస్టిట్యూట్ ని 2019లో ఆయనే శంకుస్థాపన చేశారు.
#WATCH | PM Narendra Modi showered with flowers by BJP supporters and locals as he holds road show in Mandya, Karnataka
During his visit, PM will dedicate and lay foundation stone of projects worth around Rs. 16,000 crores
(Video source: DD) pic.twitter.com/K8hvPCgpRF
— ANI (@ANI) March 12, 2023