కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. భారీగా పోలీసులు మోహరించడంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ధీటుగా స్పందించిన పోలీసులు నిరసనకారులపై కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇదిలా ఉంటే ఈ హింసాత్మక ఘటనలకు ప్రతిపక్షాలే కారణం అనే విధంగా బీజేపీ నేతలు పరోక్షంగా వాపోతున్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వంటి నేతలు కుట్రపూరితంగానే జరిగిందని అన్నారు. ఈ ఘటనపై మాకు ఎలాంటి సంబంధాలు లేదని క్లారిటీ ఇచ్చింది ఎన్ఎస్యూఐ. తాజాగా ఓ వీడియో విడుదల చేశారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్.
ఇది కూడా చదవండి: Kishan Reddy: అగ్నిపథ్ ఆందోళన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!
తమ కార్యకర్తలు హింసకు దిగినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. సైనిక ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షను రద్దు చేయడం వల్లే అభ్యర్థులు ఆందోళనకు దిగారని, ఆందోళనలో తమ కార్యకర్తలు ఎవరూ లేరని వెంకట్ అన్నారు. ఇక తనను ముందుస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని ఆయన వెల్లడించారు. తమ పాత్ర లేదని చెప్పడానికే పోలీస్ స్టేషన్ నుంచే వీడియో పంపించినట్టు తెలిపారు. సికింద్రాబాద్ అల్లర్లపై తమ పాత్ర లేదని వివరించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.