కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. భారీగా పోలీసులు మోహరించడంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ధీటుగా స్పందించిన పోలీసులు నిరసనకారులపై కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ఈ సంఘటనపై ఇటు అధికారపక్షం, అటు విపక్షాలు ఒకరిపై విమర్శలు చేసుకుంటున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ అగ్నిపథ్కి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న నిరసనలు, దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అని విమర్శించారు. ఇక ఈ ఆందోళనలకు తమకు సంబంధం లేదని ఎన్ఎస్యూఐ ప్రకటించింది. ఇక మరోవైపు అగ్నిపథ్ నిరసనల వెనక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఉన్నాయిన.. ఈ మూడు పార్టీలు కలిసి విధ్వంసం సృష్టించాయని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Rakesh: సికింద్రాబాద్ నిరసనలు: అక్కదారిలో జవాన్ అవ్వాలనుకున్నాడు.. బుల్లెట్కి బలయ్యాడు!
ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఆర్మీ అభ్యర్థులు బండి సంజయ్కి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తమ వెనక ఏ రాజకీయ పార్టీ లేదని.. తమ ఆవేదనను, భవిష్యత్తును రాజకీయాలు చేయవద్దని సూచించారు. తమ ఆందోళనకి ఎవరితో సంబంధం లేదని.. ఇది స్టూడెంట్స్ ఆక్రోశం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సికింద్రాబాద్ హింసాత్మక ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్!
They have a message for you @bandisanjay_bjp pic.twitter.com/NXYP3JsGyo
— krishanKTRS (@krishanKTRS) June 17, 2022