భారత్ లో ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకు వచ్చింది. ఇక నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే కాంట్రాక్ట్ లేక్కన ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తుంది. నాలుగేళ్లకు ఉద్యోగం పోతే తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..
అగ్నిపథ్ స్కీం పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. దేశంలో అగ్నిపథ్ స్కీంపై వస్తున్న వ్యతిరేకత, హింసాకాండపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ చేసి ఉద్యోగం చేసిన వాళ్లకు తన కంపెనీలో ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ట్విట్టర్ వేధికగా తెలిపారు. ఈ పథకం వల్ల యువతలో మంచి క్రమశిక్షణ, బాధ్యతలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో అగ్నిపథ్ ఆందోళనలు తనకు బాధ కలిగిస్తున్నాయని ట్వీట్లో ప్రస్తావించారు. అగ్నిపథ్ స్కీం ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ సర్వీస్ లో ఏ ఉద్యోగానికైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలా తయారైన అగ్ని వీర్ లను రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్ర గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గే యోచనలో లేదని ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అగ్నివీరుల ప్రయోజనం కోసం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖలో 10 శాతం ఉద్యోగ ఖాళీలను అగ్నివీర్ ల కోసం కేటాయించనున్నారు. వివిధ స్కీమ్ లు స్టార్ట్ ఆప్ ఇండియా పథకాలు అగ్ని వీరులకు అందిస్తామని తెలిపింది. మరోవైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం కొన్ని సంస్థలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి.
Saddened by the violence around the #Agneepath program. When the scheme was mooted last year I stated-& I repeat-the discipline & skills Agniveers gain will make them eminently employable. The Mahindra Group welcomes the opportunity to recruit such trained, capable young people
— anand mahindra (@anandmahindra) June 20, 2022