చార్మినార్ వివాదం గంట గంటకు సంచలనంగా మారుతోంది. చార్మినార్లో నమాజ్ కోసం కాంగ్రెస్ నేత రషీద్ఖాన్ సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ఘాటుగా స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎఐఎం పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని, మైనారిటీ ఓట్లు పొందేందుకు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మేము పాతబస్తి అభివృద్ధి జరగాలని కోరుకున్నాం తప్పా.. ఏనాడు కూడా చార్మినార్ ను తొలగించాలని అనకోలేదని తెలిపారు. ఎఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తుందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతోందని ఎద్దేవ చేశారు. ఇక దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంపై చెయ్యి వేసి చూడాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే స్పందించారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.
ఇది కూడా చదవండి: KTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘జగన్ నాకు పెద్దన్నలాంటి వాడు.. చంద్రబాబుతో విభేదాల్లేవ్’!భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేస్తే నరికేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆలయానికి హిందూ ప్రజలే అండగా నిలుస్తారని తెలిపారు. చార్మినార్ నుంచి వాహనాలే అనుమతించని పోలీసులు సంతకాల సేకరణ విషయంలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. సంతకాల సేకరణను ముస్లిం సమాజం సైతం హర్షించదని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. షో పుటప్ ప్రోగ్రాం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ కోరారు.
ఇదే కాకుండా కాంగ్రెస్ నేత రషీద్ఖాన్ పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అయితే తాజాగా చార్మినార్ వివాదంపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేస్తే నరికేస్తామంటూ రాజాసింగ్ చేసిన తాాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.