రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
చార్మినార్ వివాదం గంట గంటకు సంచలనంగా మారుతోంది. చార్మినార్లో నమాజ్ కోసం కాంగ్రెస్ నేత రషీద్ఖాన్ సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ఘాటుగా స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎఐఎం పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని, మైనారిటీ ఓట్లు పొందేందుకు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మేము పాతబస్తి అభివృద్ధి జరగాలని కోరుకున్నాం తప్పా.. ఏనాడు కూడా చార్మినార్ ను […]