Mekathoti Sucharitha: ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కని కారణంగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత అలకబూనారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారన్న వార్తలు సైతం గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుచరిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. భేటీ అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను ఎప్పుడూ చెల్లి అని సంభోదిస్తుంటారు. కుటుంబంలో మనిషిలాగా ఆదరిస్తుంటారు. మంత్రి పదవి విషయంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎమోషన్కు గురికావటం జరిగింది. కొంత అనారోగ్య కారణాలవల్ల కావనివ్వండి.. వ్యక్తిగత కారణాల వల్ల కానివ్వండి.. నేను కొనసాగలేనేమోనని ఒక థ్యాంక్స్ గివింగ్ నోట్ను రాశాను. దాన్ని రాజీనామా లేఖ అంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది.
సాధారణ దళిత మహిళను హోం మంత్రి చేసిన ఘనత సీఎం జగన్ది. పార్టీని బలోపేతం చేయటానికి, ఇతర కారణాల వల్ల నన్ను మళ్లీ మంత్రి పదవిలో కొనసాగించలేకపోయారు. దీనిపై రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనికి ఇంతటితో పులుస్టాప్ పెట్టేయండి. నన్ను సీఎం దగ్గరకు రానివ్వటం లేదన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రి కుటుంబంలో సభ్యురాలిగా ఆయన్ని ఎప్పుడైనా కలిసే అవకాశం, స్వేచ్ఛ ఉంటుంది. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం జగన్తోనే ఉంటాను. వేరే వైపు చూడాల్సిన అవసరం కానీ, అగత్యం కానీ, నాకు లేదు. పార్టీనుంచి బయటకు రావాల్సి వస్తే.. వైఎస్సార్ సీపీ కార్యకర్తగా.. ఓటర్గా ఉంటాను. పదవులు ముఖ్యంకాదు.. అవి శాశ్వతం కూడా కాదు’’ అని అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులు ‘‘మీరు రిజైన్ చేశారని మీ అమ్మాయి చెప్పారు కదా?’’ అడిగిన ప్రశ్నకు సుచరిత సమాధానం ఇస్తూ.. ‘‘ మా అమ్మాయి ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చిన అమ్మాయి కాదు.. రాజకీయాల్లో తిరిగే అమ్మాయి కాదు. చాలా చిన్న పిల్ల. మీడియా ముందుకు తీసుకొచ్చేసరికి ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది. చిన్న పిల్ల మాట పట్టుకుని హైలేట్ చెయ్యాలని చూడొద్దు. ఆ అమ్మాయికి రాజీనామా లేఖకు.. థ్యాంక్స్ గివింగ్ లెటర్కు తేడా తెలీదు’’ అని అన్నారు. మేకతోటి సుచరిత ప్రెస్ మీట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జగన్ గురించి లోతుగా తెలిసింది తనకే.. సుచరితతో సీఎం రాజీ పడాల్సిందే: వర్ల రామయ్య
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.