నెల్లూరు రాజకీయాల్లో ఈ మధ్య కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తరచుగా వినిపిస్తోంది. అధికార పార్టీతో విభేదాలు.. ప్రతిపక్ష పార్టీకి దగ్గరవ్వటానికి ప్రయత్నాలు ఇలా కోటంరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
నెల్లూరు రాజకీయాలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార పార్టీపై విమర్శలు చేయటం, రెబల్గా మారటం వంటి అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోటంరెడ్డి వర్సెస్ వైఎస్సార్ సీపీగా వార్ నడుస్తోంది. ఇక, వైఎస్సార్ సీపీతో విభేదాల తర్వాత కోటంరెడ్డి టీడీపీతో కలవటానికి ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు పోటీ చేయమన్న స్థానం నుంచి పోటీ చేస్తానని అన్నారు. అయితే, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి జనసేన వైపు చూస్తున్నారంట. కోటంరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించటానికి టీడీపీ అధినాయకత్వం ఎందుకు ఆలోచిస్తోంది?.. ఒక వేళ కోటంరెడ్డి జనసేనలో చేరితో ఎవరికి లాభం? అన్న అంశాలు ఇప్పుడు చర్చిద్దాం..
అధికార వైఎస్సార్ సీపీతో విభేదాల తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లటానికి నిశ్చయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయమన్న స్థానం నుంచి పోటీ చేస్తానని కూడా మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే, టీడీపీనుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందన వచ్చినట్లు కనిపించటం లేదు. ఇందుకు కారణం గతంలో టీడీపీ కార్యకర్తలు, నేతల పట్ల కోటంరెడ్డి వ్యవహార శైలేనని తెలుస్తోంది. నిన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా తమ పార్టీ కార్యకర్తలపై, నేతలపై కోటంరెడ్డి దాడులు చేయించాడని, అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించాడని చంద్రబాబు దగ్గర పలువురు జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తమతో దారుణంగా వ్యవహరించిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ కోటంరెడ్డికి సీటు ఇస్తే ఆయనతో కలిసి పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా లేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నారంట. కోటంరెడ్డి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని భావిస్తున్నారట. కోటంరెడ్డి కంటే తమ కార్యకర్తలు, నేతలే ముఖ్యమనే నిర్ణయానికి కూడా వచ్చారంట. మరికొన్ని రోజుల్లో ఇదే విషయాన్ని కోటంరెడ్డికి స్పష్టం చేసే అవకాశం ఉందని సమచారం.
పార్టీలోకి ఆహ్వానించే విషయంలో టీడీపీ తాచ్చారం చేస్తుండటంతో కోటంరెడ్డి కూడా ఆలోచనలో పడ్డారంట. టీడీపీ కాకపోతే జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నారంట. కోటంరెడ్డి నెల్లూరు రాజకీయాలపై బాగా పట్టు ఉన్న మనిషి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయనకు తిరుగు లేదు. మరోసారి కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది. ఒక వేళ జనసేనలోకి కోటంరెడ్డి చేరితో కచ్చితంగా అది జనసేనకు ప్లస్ అవుతుంది. జనసేన ఖాతాలోకి ఓ ఎమ్మెల్యే సీటు ఖాయం అవుతుంది. అంతేకాదు.. కోటంరెడ్డి నికార్షయిన రాజకీయ నాయకుడు. తాను బతికున్నంత వరకు రాజకీయాలు చేస్తానని ఇది వరకే స్పష్టం చేశారు. తనకు సీటు ఇచ్చే పార్టీనుంచి పోటీ చేస్తానన్నారు.
టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు.. బీఆర్ఎస్ కూడా కావచ్చు.. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరతానన్నారు. ఇక, నెల్లూరులో జనసేనకు కూడా మంచి ఆదరణ ఉంది. జనసేనలోకి కోటంరెడ్డి వస్తే జనసేనకు ఎంత లాభం చేకూరుతుందో.. కోటంరెడ్డికి కూడా అంతేలాభం చేకూరుతుంది. ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలవటానికి మరింత బలం వస్తుంది. అయితే, కోటంరెడ్డి నిజంగానే జనసేనలోకి వెళతారా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. మరి, కోటంరెడ్డి జనసేనలో చేరతారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.