బద్వెల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ సంచలన విజయాన్ని సాధించారు. వార్ వన్ సైడే అంటూ మొదటి రౌండ్ నుంచే భారీ ఆధిక్యంతో దూసుకెళ్తూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. బద్వేల్లో మొత్తం మొత్తం 1 లక్షా 47 వేల 213 ఓట్ల పోల్ కాగా అందులో వైసీపీ అభ్యర్థి సుధకి 1 లక్షా 12 వేల 221 ఓట్లు లభించగా బీజేపీకి 21 వేల 678 ఓట్లు, కాంగ్రెస్కు 6235 ఓట్లు వచ్చాయి.
ఇక మొత్తానికి వైసీపీ అభ్యర్ధి సుధ బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకోవటమే కాకుండా 90 వేల 590 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిపొంది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి 90,110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. అయితే జగన్ పై ఉన్న ఈ మెజార్టీ కంటే బద్వెల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధ 90 వేల 590 ఓట్ల భారీ ఆధిక్యంతో జగన్ రికార్డ్ ను బ్రేక్ చేయటం విశేషం.