బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బీజీపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా జీవీఎల్కు చివాట్లు పెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ల గురించి చెబుతూ జీవీఎల్కు కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో నాయకుల మధ్య పొరపచ్చాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భేదాభిప్రాయాలతో ఒకరంటే ఒకరికి పడటంలేదు. కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై కామెంట్లు చేసి, పార్టీనుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నా బీజేపీకి రాజీనామా కూడా చేశారు. కన్నా బయటకు రావటంతో సద్దుమణుగుతాయనుకున్న గొడవలు మరో రూపంలో తెరపైకి వచ్చాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి మండిపడుతున్నారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆమె తప్పుబడుతున్నారు. ట్విటర్ వేదికగా శుక్రవారం ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘అన్నీ ఇద్దరి పేర్లేనా” ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే,
మరోకరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు జీవీఎల్ నరసింహరావు మాట్లాడిన వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం పురందేశ్వరి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. బీజేపీలో లుకలుకలు ఎక్కువయ్యాయంటూ కొందరు అంటుంటే.. తండ్రిని అన్నందుకు కౌంటర్గా పురందేశ్వరి ఈ కామెంట్లు చేశారని మరికొందరు అంటున్నారు. కాగా, పురందేశ్వరి పోస్టు చేసిన వీడియోలో ఈ విధంగా ఉంది..‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అనేవి కేవలం రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు పరిమితమైన అంశం కాదని అన్నారు.
ఆ విషయంలో అయినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబమే.. ఆ పార్టీ, ఈ పార్టీనే అని పేర్కొన్నారు. అన్నీ ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లేనా. సామాజిక న్యాయం అనేది అందరికీ వుండాలా? లేదా? అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన్రంగా కేవలం ఒక్క కాపుల కోసం పని చేయలేదని, బడుగు, బలహీన వర్గాలందరి కోసం పని చేశారని చెప్పారు. ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు, మోహన్రంగా పేరు కూడా పెట్టాలని అడిగితే ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలా అంటూ జీవీఎల్ గట్టిగా ప్రశించారు. మరి, జీవీఎల్కు పురందేశ్వరి కౌంటర్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“అన్నీ ఇద్దరి పేర్లేనా”
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023