టీడీపీ నేత, దెంగులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ వాపోయారు. ఇక ఇంతటితో ఆగకుండా ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నలుగురు ఐపీఎస్ అధికారులు, నలుగురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ఆయన ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత సంవత్సరంలోని ఆగస్ట్ లో పోలీసులు నన్ను ఎన్ కౌంటర్ చేయాలని చూశారంటూ చింతమనేని సంచలన ఆరోపణలు లేవనెత్తారు. ఇదే విషయంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గత రెండేళ్ల కాలంలో నాపై 25 కేసులు నమోదు చేశారని వాపోయారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు నాపై అక్రమంగా కేసులు పెడుతున్నారని చింతమనేని ప్రభాకర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Nagababu: కోనసీమ వివాదం.. సజ్జలపై విరుచుకుపడ్డ నాగబాబు.. ఏకంగా వెధవ అంటూ!
దీంతో పాటు రాజకీయంగా నాపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాల్లో లేకుండా చేస్తున్నారని చింతమనేని వ్యాఖ్యానించారు. ఇక చింతమనేని తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. నన్ను ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రయత్నించారన్న చింతమనేని తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.