ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఎర్త్ అవర్ పాటించాలని గవర్నర్ సూచించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్ పాటించాలని.. అత్యవసరమైతేనే లైట్లు వాడాలని కోరారు. రాష్ట్రంలోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేసి ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని కోరారు.
భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ అన్నారు. ఇక ఇదే కాకుండా మేధావులు, చదువుకున్నవాళ్లు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎర్త్ అవర్ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ విజయవాడ రాజ్భవన్ ఆవరణలో అన్ని అనవసరమైన లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
ఇది కూడా చదవండి: MLA చెవిరెడ్డి అసెంబ్లీలో చెప్పులు వేసుకోరు! కారణం చెప్పిన అంబటి రాంబాబు!ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు ఎర్త్ అవర్ను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఎర్త్ అవర్ కార్య్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.