తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. అయితే, తాజాగా ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు.
ప్రియదర్శిని రామ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారు. ఇదే కాకుండా ఓ ప్రముఖ తెలుగు మీడియాలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ప్రియాదర్శిని రామ్ కి వైఎస్సార్ అన్నా.,, ఆయన కుటుంబం అన్నా ఎంతో ప్రేమ. చాలా రోజులుగా వారి కుటుంబానికి విధేయుడిగా ఉంటూ నమ్మిన బంటులా మెలిగాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ మీడియా నుంచి బయటకు వచ్చాడు. ఇకపోతే.. ప్రియదర్శిని రామ్ ను సుమన్ టీవీ తాజాగా ఇంటర్వ్యూ చేసింది.
ఇందులో ఆయన వైఎస్సాఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. ఇక యాంకర్ రామ్ ను.. జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవలు, విభేదాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి? అందులో నిజమెంత అంటూ ప్రశ్నించారు. దీనికి ప్రియదర్శిని రామ్ సమాధానమిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా ఓ మాయ. జగన్ ఆడవాళ్లను ఎంతో గౌరవిస్తారు. బాగా చూసుకుంటారు. తన తల్లిని, చెల్లిని కూడా బాగా చూసుకుంటారు. కొంతమంది సొంత చెల్లిని, గెంటేశాడని అంటున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఇప్పుడు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. జగన్, షర్మిల కలిసి ఇప్పటికీ భోజనం కూడా చేస్తారని రామ్ చెప్పుకొచ్చారు. ఇక భారతమ్మ.. షర్మిల ఇంటికి వచ్చి పిల్లలు ఎలా ఉన్నారని వాళ్ల బాగోగులు తెలుసుకుంటారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని ప్రియదర్శిని రామ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్