తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్ జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతున్నాయి. తనకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మలేషియాకు చెందిన తమిళ నటి చాందిని కోరారు. చాందిని స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్ను అరెస్టు కూడా చేశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో మంత్రిగారితో పరిచయం ఏర్పడగా అది సహజీవనానికి దారితీసింది.
గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ నటి చాందిని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని ఇప్పటి వరకు మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. ప్రస్తుతం ఈ కేసు చెన్నై హైకోర్టు విచారణలో ఉండగా చాందిని ఒక పిటిషన్ దాఖలు చేశారు.
దీనిలో ఆమె, మాజీమంత్రి మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాదు తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకుగాను తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా ఆయనే చెల్లించాలని తాజా పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుందని తెలుస్తోంది.
‘నోమాడ్స్’ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మలేషియా నటి చాందిని ఓ ప్రైవేట్ ఈవెంట్లో మంత్రిగారితో పరిచయం ఏర్పడింది. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది చాందిని.
అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని, రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని.
గతంలో ఆమె చెప్పిన మాటలు ఈ వీడియోలో చూడండి.