కల్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేసిన మూవీ 'అమిగోస్'. డోప్ల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా థియేటర్లలో తాజాగా రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్.. ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఏదైనా తెలుగు సినిమా రిలీజ్ కావడం లేటు… ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూస్తుంటారు. అలా ప్రతి శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి తెగ సెర్చ్ చేస్తుంటారు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ చూసిన కొందరు ఆడియెన్స్ బాగుందని, మరికొందరు మాత్రం నచ్చలేదని చెబుతున్నారు. ఈ టైంలో ఓటీటీ రిలీజ్ గురించి వచ్చిన న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నందమూరి హీరోల్లో కల్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తుంటాడు. అలా గతేడాది ఆగస్టులో ‘బింబిసార’గా వచ్చి సూపర్ హిట్ కొట్టేశాడు. ఆ ఊపులో ఈ సినిమాను త్వరత్వరగా పూర్తి చేసి రిలీజ్ చేశారు. కానీ అంచనాల్ని అందుకోవడంలో ‘అమిగోస్’ కాస్త వెనకబడిందని చూసిన ఆడియెన్స్ అంటున్నారు. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దాన్ని స్క్రీన్ పై చూపించడంలో పూర్తిగా తడబడ్డారని అనేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణ్ రామ్.. మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా పరిచయమైంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా కొన్నికొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకున్నాడు. ఇక ‘అమిగోస్’ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన మూడు నాలుగు వారాల తర్వాత అంటే.. మార్చి తొలి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిమీలో ఎంతమంది ‘అమిగోస్’ చూశారు. ఒకవేళ చూస్తే ఎలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.