మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు. తాగి నానా యాగి చేస్తుంటారు కొంత మంది మద్యం ప్రియులు. రోడ్డుపైనే ప్రతి ఒక్కరితో గొడవపెట్టుకుంటారు. అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ.. కోట్లాటకు దిగుతారు.
మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు కొంత మందికి. తాగి నానా యాగి చేస్తుంటారు. రోడ్డుపైనే ప్రతి ఒక్కరితో గొడవపెట్టుకుంటారు. అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ.. కోట్లాటకు దిగుతారు. పీకల దాకా తాగి, అర్థరాత్రుళ్లు ఒళ్లు మరచి రోడ్డపై హంగామా సృషించే తాగుబోతులను అనేక మందిని చూసుంటాం. ఇళ్లు, ఒళ్లు గుళ్లవుతున్నా పట్టించుకోకుండా.. మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో మహిళలు సైతం తామేమీ తక్కువ తాగేడం లేదని నిరూపిస్తున్నారు. పార్టీలు, పబ్ కల్చర్ అలవాటు పడ్డాక.. రాత్రిళ్లు పొద్దుపోయేదాకా మద్యం సేవించి.. వాహనాలు నడపడం, మధ్య దారిలో ఎవ్వరితో ఒకరితో గొడవ పడటం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది.
ఉత్తరప్రదేశ్లో ముగ్గురు యువతులు ఫూటుగా మద్యం సేవించి రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. మోడ్రన్ డ్రస్లో ఉన్న యువతులు రోడ్డుపై వీరంగం సృష్టిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. అక్కడ నుండి వెళ్లిపోవాలని సూచించారు. అయితే పోలీసులు మాట్లాడుతుండగానే..ఇద్దరు యువతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన అంతా వీడియోలు తీశారు. ముగ్గురు అక్కడ నుండి వెళ్లిపోతుండగా వారిని అనుసరిస్తూ చాలా మంది వీడియోలు తీస్తుండగా.. వారిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వీరిని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని సమాచారం.