క్రైం డెస్క్- సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా అడవాల్లపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఆడవాళ్లు అంతరిక్షంపైకి వెళ్లి వస్తున్నా.. ఇంకా మగాళ్ల నుంచి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సాధారనంగా ఆడవాళ్లను ప్రేమ, పెళ్లి పేరుతో చాలా మంది మోసం చేస్తుంటారు. వాళ్లను శారీరకంగా వాడుకుని వదిలేస్తున్న ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ గుజరాత్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ సంఘటన జరిగింది. ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి.. అబ్బాయికి మాయమాటలు చెప్పి మోసం చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ మహిళ తనకంటే వయసులో చిన్నవాడిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఆశ్చర్యకర సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన 17 బాలుడు గత నెల అనగా మే నెల 25 నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బాలుడు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇల్లు, తెలిసిన వారి ఇళ్లలో వెతికారు. ఎక్కడ బాలుడి జాడ తెలియకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడు సూరత్ లో ఉన్నాడని గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ బాలుడిని తీసుకువచ్చారు. బాలుడిని తీసుకువచ్చే క్రమంలో యువతి బాగోతాలు బయటకువచ్చాయి. 23 ఏళ్ళ యువతి బాలుడి ఇంటి సమీపంలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలుడితో పరిచయం ఏర్పడింది. మెల్ల మెల్లగా బాలుడిని మచ్చిక చేసుకుని తన కోరికలు తీర్చుకునేదట ఆ యువతి.
ఆ 17 ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతి బాగోతం విని పోలీసులే కంగుతిన్నారు. బాలుడిని పెళ్లి చేసుకుంటానని. ఇద్దరం కలిసే ఉందామని నమ్మించి సూరత్ తీసుకెళ్లింది ఆ అమ్మాయి. అక్కడికి వెళ్లాక అతనితో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 15 రోజుల పాటు ఆ అమ్మాయి బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంది. మరి ఇంకా ఎన్నాళ్లు అలా ఎంజాయ్ చేసేదో తెలియదు కానీ, పోలీసులు బాలుడి ఆచూకీ తెలుసుకుని వెళ్లి తీసుకురావడంతో యువతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినందుకు, శారీరక వాంఛలు తీర్చుకున్నందుకు సదరు యువతిపై కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలాసులు. మరి కలికాలం అంటే ఇదేనేమో అని అంటున్నారు స్థానికులు.