అమరావతి- ఈ మధ్య రాజకీయ నాయకుల సెటైర్లు, కామెంట్స్ పరిధి దాటుతున్నాయని చెప్పవచ్చు. ఒకప్పుడు రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు మాత్రమే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు నాయకులు వ్యక్తిగత అంశాలపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి ప్రజల్లో చులకన అవుతున్న సందర్బాలను మనం చాలానే చూస్తున్నాం.
ఆంద్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుముంటుంది. ఇరు పార్టీల నేతలు ఎకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్ పై విజయసాయి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
లోకేష్ను ప్రజల్లో తిప్పాలని కుటుంబం మొత్తం చంద్రబాబుకు సలహాలు ఇస్తుంటే, లోకేష్ మాత్రం గోరింటాకు పెట్టించుకుని ఫాంహౌస్లో పడుకున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు లోకేష్పై ఎలాంటి ఆంక్షలు లేవని వ్యాఖ్యానించారు. ఈమేరకు ట్విట్టర్ లో కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు విజయసాయి రెడ్డి.
ఆషాడంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతుంటాయి.. రాష్ట్రంలో తిరగడానికి నీకు మాత్రం ఆంక్షలేమీ లేవు లోకేశా.. మీ కుటుంబ సేవకులంతా నిన్ను బాగా తిప్పాలని బాబుకు సలహాలిస్తుంటే.. ఆషాఢం అంటూ చేతులకు గోరింటాకు పెట్టించుకుని ఫాం హౌజ్లో పడుకుంటే ఎలా చిట్టీ.. అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. విజయసాయి రెడ్డి ట్వీట్ పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆషాడంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతుంటాయి. రాష్ట్రంలో తిరగడానికి నీకు మాత్రం ఆంక్షలేమీ లేవు లోకేశా. మీ కుటుంబ సేవకులంతా నిన్ను బాగా తిప్పాలని బాబుకు సలహాలిస్తుంటే ఆషాఢం అంటూ చేతులకు గోరింటాకు పెట్టించుకుని ఫాం హౌజ్లో పడుకుంటే ఎలా చిట్టీ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2021