ఈ “ప్రేమ” అనేది చదవటానికి రెండు అక్షరాల పదమే. కానీ ఈ రెండు అక్షరాల పదం ఎన్నో ఘటనలు కారణమవుతుంది. మనిషిని మృగంగా.. మృగం లాంటి వాడిని మనిషిలా మార్చే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనే కొందరి అభిప్రాయం. ధైర్యం లేని వారికి కూడా ప్రేమ విషయంలో ఎక్కడ లేని తెగింపు వస్తుందని చాలా మంది అభిప్రాయం. అలానే తాజాగా ఓ ప్రేమ జంట గోదావరి నదిలో కి దూకారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు గల్లంతైనాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం ప్రాంతంలో యానాం-ఎదురులంక బ్రిడ్జ్ పై నుండి మంగళవారం సాయంత్రం ప్రేమ జంట గోదావరి నదిలోకి దూకారు. వంతెనపై ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. మత్య్సకారుల సాయంతో గాలించిగా యువతి మృత దేహం లభ్యమైంది. యువకుడు ఆచూకీ లభించలేదు. మృతురాలు యానాం ప్రాంతానికి చెందిన పాలేపు శాంతి(17)గా పోలీసులు గుర్తించారు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ముమ్మడివరం ప్రాంతానికి చెందిన శివరామ్ సాయిపై శాంతి కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుటుంబ సభ్యులు ప్రేమించిన వాడిపై కేసు పెట్టినా తన ప్రేమను శాంతి చంపుకోలేకా పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంట్లో వారిని ఎదిరించేత ధైర్యం లేదు. వారిని కాదని బ్రతికుండా తమ ప్రేమ గెలవదని తెలిసి..ఇలా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరి మాట. అయితే ఇప్పుడు నదిలో గల్లంతైన యువకుడు శివరామ్ సాయిగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్సై తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.