రాజస్థాన్ క్రైం- నేరం చేసినవాడు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు దొరకక మానడు. ముందు తప్పించుకోవచ్చు.. కానీ చివరకు పోలీసులకు చిక్కాల్సిందే. ఇదిగో ఇక్కడ 29 ఏళ్ల నేర చరిత్ర కలిగిన ఓ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. అతడేమి మామూలు దొంగ కాదు.. 6 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 48 ఏళ్ల వయసులో 29 ఏళ్ల నేర జీవితం వాడిది. సుమారు 17 ఏళ్లుగా స్టార్ హోటళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. మొత్తం 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 36 చోరీలు చేసి ఏకంగా 19 కోట్ల రూపాయలు కొట్టేశాడు.
ఈ కేటుగాడి పేరు జయేశ్ రావ్జీ సెజ్పాల్. ప్రస్తుతం ఇడగాడి కోసం రాజస్తాన్లోని జైపూర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాజీవ్ ను ఆఖరిసారి 2018 మార్చిలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడి కదలికలపై సమాచారం ఉండే అందించాల్సిందిగా కోరారు. సెజ్పాల్ గత నెల్లో జైపూర్, ఉదయ్పూర్ల్లో రెండు నేరాలకు పాల్పడ్డాడు. గుజరాత్కు చెందిన జయేశ్ రావ్జీ సెజ్పాల్ పదవతరగతి వరకు చదివుకున్నాడు. గుజరాత్ తో పాటు ముంబైలో ఉన్న కొన్ని హోటల్స్ లో క్యాటరింగ్ వర్కర్గా పని చేసేవాడు. ఐతే అలా వచ్చే ఆదాయంతో బతకడం అతనికి ఇబ్బందిగా అనిపించింది.
1991లో మొదటిసారి ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో దొంగతనం చేశాడు. అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న వీసీపీని ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కి ఆథర్ రోడ్ జైలుకు వెళ్లాడు. అక్కడే మరో నేరగాడితో జయేశ్ కు పరిచయమైంది. అతడి సలహాతో స్టార్ హోటళ్ళను టార్గెట్గా చేసుకుని నేరాలు చేయాలని పథకం వేశాడు. నకిలీ గుర్తింపుకార్డుల ద్వార మధ్య తరహా హోటల్లలో బస చేస్తాడు. ఆపై ఆటోలో ఏదో ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన జంటలు, వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని అక్కడ గుర్తిస్తాడు. వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో వీరిని టార్గెట్ చేస్తాడు.
ఇక వారిని ఫాలో అవుతూ ఏ గదిలో బస చేశారో, ఏయే సమయాల్లో బయటకు వెళ్ళి వస్తున్నారో రెక్కీ నిర్వహిస్తాడు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందిని మచ్చిక చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న ఆ వ్యక్తుల పేరు, వివరాలు తెలుసుకుంటాడు. హోటల్ లాబీల్లో తిరిగే సదరు వ్యక్తుల్ని పేరుతో పలకరిస్తూ వారితో మాట కలుపుతాడు. ఇలా రెండు మూడు సార్లు తన టార్గెట్తో మాట్లాడుతూ హోటల్ సిబ్బంది కంటపడతాడు. దీంతో వారు జయేశ్ ఆ జంటకు బంధువో, స్నేహితుడో అయి ఉంటాడని అనుకునేలా చేస్తాడు.
ఆ తరువాత వారి గది ఉన్న ఫ్లోర్ కు చేరుకుని రిసెప్షన్ ను సంప్రదించి యాక్సిస్ కార్డు మర్చిపోయానంటూ చెప్పి హోటల్ సిబ్బందిని నమ్మించి మరో యాక్సిస్ కార్డు తీసుకుని వారు బస చేసిన గదిలోకి వెళ్తాడు. ఇంకేముంది చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను కొట్టేసి హోటల్ నుంచి ఆటోలో బయలుదేరి తాను బస చేసిన లాడ్జికి వెళ్తాడు. అక్కడ నుంచి చోరీ సొత్తుతో సహా ముంబైకి పారిపోయి అక్కడ అమ్ముకుంటాడు. జయేశ్ మన హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు 18 మెట్రో నగరాల్లో దొంగతనాలు చేశాడు. 2014లో మొదటిసారి హైదరాబాద్ కు వచ్చి జూన్ 6న మెర్క్యూరీ హోటల్లో 10 లక్షల విలువైన బాంగారం ఎత్తుకుపోయాడు.
ఆ తరువాత 2016 డిసెంబర్ 16న అమీర్పేట మ్యారీగోల్డ్ హోటల్ లో 4 లక్షల బంగారాన్ని కొట్టేశాడు. చేశాడు. 2018 మార్చి 6న బంజారాహిల్స్లోని స్టార్ హోటల్ పార్క్ హయత్లో 30 లక్షల బంగారం చోరీ చేసి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. బెయిల్పై బయటికొచ్చిన జయేశ్ గత నెల 20న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ హోటల్లో కోటి విలువజేసే బంగారం, ఆ తరువాత జైపూర్లోని హోటల్ నుంచి 2 కోట్ల విలువైన బంగారం, నగదు కాజేశాడు. సీసీ కెమెరాల ద్వార జయేశ్ను గుర్తించిన రాజస్తాన్ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తం 36 చోరీలు చేసి ఏకంగా 19 కోట్ల రూపాయలు కొట్టేశాడంటే వీడు మామూలోడు కాదు అని ఆరు రాష్ట్రాల పోలీసులు అంటున్నారు.