ఫిల్మ్ డెస్క్- కరోనా మహమ్మారి చాలా రంగాలపై ప్రభావం చూపించింది. అందులో సినిమా రంగం కూడా ఒకటి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సందర్బంగా చాలా రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో సినిమా ధియేటర్స్ మూతబడ్డాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయింది. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. చాలా వరకు సినిమాలన్నీ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై విడుదలవుతున్నాయి.
ఇప్పుడు కరోనా కాస్త తగ్గముఖం పట్టడంతో సినిమా ధియేటర్స్ మెల్ల మెల్లగా ప్రారంభమవుతున్నాయి. కొన్ని సినిమాలను సైతం ధియేటర్స్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీ విషయంలో సినిమా ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాను ధియేటర్స్ లోనే విడుదల చేయాలని కొందరు వాదిస్తోంటే, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు ధియేటర్స్ కు వచ్చే అవకాశం లేదని, ఓటీటీనే మేలని మరి కొందరు అంటున్నారు.
ఇప్పుడు నాచురల్ స్టార్ నాని సినిమా టక్ జగదీశ్ విషయంలో ఇదే వివాదం చలరేగుతోంది. నాని టక్ జగదీశ్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై సినిమా ధియేటర్స్ యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ మధ్యనే తిమ్మరుసు సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న నాని, సినిమాను ధియేటర్స్ లోనే చూడాలని, అందరు ధియేటర్స్ కు వెళ్లి సినిమాలను ప్రోత్సహించి, ఇండస్ట్రీని కాపాడలాని చెప్పారు.
ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న ఎగ్జిబీటర్లు.. నాని సినిమాలో మాత్రమే హీరోనా, నిజ జీవితంలో జీరోనా అని ప్రశ్నిస్తున్నారు. సినిమాను ధియేటర్స్ లోనే చూడాలని చెెప్పిన నాని, తన సినిమా టక్ జగదీష్ ను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని వారి నిలదీస్తున్నారు. ఇప్పటికైనా నాని మనమసు మార్చుకుని టక్ జగదీష్ సినిమాను ధియేటర్స్ లో విడుదల చేయాలని ఎగ్జిబీటర్స్ డిమాండ్ చేశారు.
లేదంటే ఇకపై నాని సినిమాలేవి ధియేటర్స్ లో విడుదల చేయమని వారి హెచ్చరించారు. ఐతే ఈ వివాదంపై నాని మాత్రం మరో విధంగా చెబుతున్నారు. సినిమాను ఎక్కడ విడుదల చేయాలన్నది నిర్మాత ఇష్టమని, ఈ విషయంలో తన ప్రమేయం లేదని అంటున్నాడు. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది.