ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు.. విన్నాం. పాకిస్తాన్ నుండి శ్రీలంక వరకు మన దేశ పోరగాళ్ల కోసం భారత్కు వచ్చేసిన మహిళ గాధల్ని చదివాం. సీమా హైదర్ (పాకిస్తాన్), జూలీ(బంగ్లాదేశ్), పోలాక్ బార్బరా(పోలాండ్), విఘేశ్వరి(శ్రీలంక) నుండి వచ్చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు.. విన్నాం. పాకిస్తాన్ నుండి శ్రీలంక వరకు మన దేశ పోరగాళ్ల కోసం భారత్కు వచ్చేసిన మహిళ గాధల్ని చదివాం. సీమా హైదర్ (పాకిస్తాన్), జూలీ(బంగ్లాదేశ్), పోలాక్ బార్బరా(పోలాండ్), విఘేశ్వరి(శ్రీలంక) నుండి ఇండియాకు వచ్చేశారు. వీరంతా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ సోషల్ మీడియా ద్వారానే పరిచయమై.. కొన్నాళ్ల కాపురం చేశాక కోర్టు మెట్టెక్కింది. ప్రియుడితో ఇష్టపూర్వకంగానే ఆరేళ్ల సహజీవనం చేశాక.. ఇప్పుడు ఆమె వేసిన పిటిషన్లపై ఘాటుగానే స్పందించింది హైకోర్టు. ఆమెకు చీవాట్లు పెట్టింది. ఇంతకు ఏం జరిగిందంటే..?
2013లో కర్ణాటకలోని దావణగెరెకు చెందిన మహిళకు ఫేస్ బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు సమీప ప్రాంతాలే కావడంతో అప్పుడప్పుడు కలిసేవారు. తాను మంచి చెఫ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. మంచి వంటలు చేసి తినిపించేవాడు. ఇద్దరు కలిసి బీర్ తాగేవారు. అలా శారీరకంగా ఒకటయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో సహజీవనం మొదలుపెట్టారు. ఆరు సంవత్సరాల తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొహం చాటేస్తుండటంతో 2021లో మోసం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ప్రియుడిపై కేసు నమోదు చేసింది. అరెస్టై జైలు కెళ్లిన సదరు వ్యక్తి.. తిరిగి బెయిల్ పై విడుదలయ్యాడు.
బెయిల్ పై విడుదలయ్యి దావణగెరెలో నివసిస్తున్నాడని తెలుసుకున్న మహిళ.. అత్యాచారం, దాడి ఆరోపణలు చేస్తూ మరో కేసు పెట్టింది. తనపై నమోదైన కేసులను సవాలు చేస్తూ అతడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన హైకోర్టు బెంగళూరు నివాసిపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేసింది. ఆరేళ్లు ఇష్టపూర్వకంగా సహజీవనం చేశాక.. దాన్ని అత్యాచారం అనడం సరికాదని పేర్కొంది. ఈ ఆరోపణలు చట్ట ప్రక్రియ దుర్వినియోగానికి ఉదాహరణగా పేర్కొంది. ఏకాభిప్రాయంతో ఆరేళ్లు శారీరక సంబంధం కలిగి, పెళ్లికి నిరాకరించాడన్న అక్కసుతో అత్యాచారం అనడం సరికాదంటూ.. అతడిపై నమోదు చేసిన రెండు కేసులను జస్టిస్ నాగ ప్రసన్న ధర్మాసనం కొట్టివేసింది.