హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. ప్రధానంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దాహానంలా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో జనజీవనం అస్థవ్యస్తం అవుతోంది. కరోనా కటట్డికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నా.. అందరికి ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కు మందును కనుక్కునే విషయంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటివంటి సమయంలో రోచ్ ఇండియా, సిప్లా సంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి. కరోనా ను ఎదుర్కోనే నిర్ధిష్టమైన ఔషధాన్ని ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా విడుదల చేశాయి. దీంతో కరోనా రోగులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
కరోనా లక్షణాలున్న బాధితుల్లో ఉపయోగించే యాంటీబాడీ కాక్ టెయిల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ మందును రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశాయి. దీనికి ఐసీఎంఆర్ కూడా అనుమతులు ఇచ్చింది. కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనే కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ ను కలిపి ఈ మందును తయారు చేశారు. వైద్య పరిబాషలో వీటిని యెనోక్లోనల్ యాంటీబాడీస్ అని పిలుస్తారు. ఇవి బాధితుడి శరీరంలో ప్రవేశించి హానికర వైరస్ ను సమర్ధవంతంగా తరిమికొడతాయి. యాంటీబాడీ కాక్ టెయిల్ ఒక్కో ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చు. ఈ మందు వాడకం వల్ల కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఔషధం ఒక డోసు ఖరీదు అన్ని పన్నులతో కలపి 59,750 రూపాయలు.
దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తొలి బ్యాచ్ లో యాంటీబాడీ కాక్ టెయిల్ లక్ష ప్యాక్ లు అందుబాటులోకి తెచ్చారు. ఇక వచ్చే నెల జూన్ రెండో వారంలో సెకండ్ బ్యాచ్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఔషధంతో స్వల్ప, మధ్యస్థ కరోనా లక్షణాలున్నావారికి సమర్ధవంతంగా చికిత్స అందించవచ్చని, ఈ మందు వాడిన రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఐతే యాంటీబాడీ కాక్ టెయిల్ ఔషదాన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఎవరికి వారు సొంతగా వాడకూడదని హెచ్చరిస్తున్నారు.