విదేశాల్లో చదువుకుని, మంచి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని ఎన్నో కలలతో పరుగులు తీస్తుంటారు భారతీయ యువతీ యువకులు. అక్కడకు వెళ్లాక చదువుతో డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. పాటు పార్ట్ టైం జాబులు చేస్తుంటారు విద్యార్థులు
విదేశాల్లో చదువుకుని, మంచి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని ఎన్నో కలలతో పరుగులు తీస్తుంటారు భారతీయ యువతీ యువకులు. అక్కడకు వెళ్లాక చదువుతో డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక పార్ట్ టైం జాబులు చేస్తుంటారు విద్యార్థులు. ఎన్నో ఆశలతో అబ్రాడ్లో అడుగుపెడుతున్న భారతీయుల జీవితాలు మాత్రం తామరాకు పైన నీటి బొట్టుగా మారిపోయాయి. ఏ క్షణంలో ఎటు నుండి మృత్యువు దూసుకొస్తుందో చెప్పడం కష్టంగా మారిపోయింది. అమెరికా వంటి దేశాల్లో జాతి వివక్ష కారణంగా అనేక మంది ఇండియన్స్ బలైన సంగతి విదితమే. అలాగే రోడ్డు ప్రమాదాల్లోనూ గాయపడిన వారు, మృత్యువాత పడ్డవారున్నారు. ఇప్పుడు మరో యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువతి మృత్యువుతో పోరాడుతుంది. ఇంతకు ఏమైందంటే.. పిడుగు పాటుకు గురై, ఆమె బ్రెయిన్ దెబ్బతింది. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ (యూహెచ్)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తుంది సుశ్రూణ్య కోడూరు (25). జులై మొదటి వారంలో తన స్నేహితులతో కలిసి పార్కులో ఓ కొలను వెంబడి నడుస్తుండగా.. పిడుగు పాటుకు గురవ్వడంతో కొలనులో పడిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా..పిడుగు పాటు కారణంగా 20 నిమిషాల పాటు గుండె లయ తప్పడంతో సుదీర్ఘకాలం పాటు వైద్య చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు బంధువు సురేంద్ర కుమార్ తెలిపారు. వైద్య ఖర్చుల కోసం, కుటుంబ సభ్యులను ఇక్కడకు పిలిపించేందుకు అవసరమైన ఆర్థిక నిమిత్తం గోఫండ్ మీని ఏర్పాటు చేశారు.