చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ప్రవీణ్ తనకి మంచి మిత్రుడని, ఒక మహిళ ఫోటోలను చూపిస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తారా అని పోలీసులను ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో క్యూ న్యూస్ ఛానల్ పై దాడి చేసిన పోలీసులు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని మల్లన్నను అరెస్టు చేసారు. ఈ సమయంలో మల్లన్న అభిమానులు పోలీసుల మీదకి రావడంతో రభస జరిగింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు. క్యూ-న్యూస్లో బ్యూరోచీఫ్గా పనిచేసిన చిలుక ప్రవీణ్ ఇటీవల సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ నిర్వహించి మల్లన్నపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సైబర్క్రైమ్స్లో సోమవారం ఫిర్యాదు చేశారు.
తనను తీన్మార్ మల్లన్న మానసికంగా వేధిస్తున్నాడని, ప్రవీణ్తో ఉన్న వివాదంలోకి తనను లాగి వ్యక్తిగతంగా అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్నకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీఐ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం క్యూ-న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ నిరాకరించారు.
క్యూ-న్యూస్ చానెల్లో సోదాల నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం జరగగా, ఇతరులను లోపలికి అనుమతించలేదు. తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో భారీ సంఖ్యలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యలో సోదాలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తీన్మార్ మల్లన్న అసలు తనిఖీలు ఎందుకు చేస్తున్నారో కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.