హైదరాబాద్- వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించాక సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీలీ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఎండీగా సజ్జనార్ తీసుకునే నిర్ణయాలను ప్రజలతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులు సైతం మెచ్చుకుంటున్నారు.
సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రగతి రథ చక్రంగా పిలిచే ఆర్టీసీ బస్సు సామాన్యులకు మరింత చేరువ కావడంతో పాటు సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. సంక్రాంతి వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంచకుండా సాధారణ ధరలకే అందుబాటులో ఉంచడంతో ప్రయాణీకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది.
సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే సజ్జనార్ సినిమాల్లో సీన్లను ఆర్టీసీకి అన్వయిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చాలా మంది హీరోలకు సంబందించిన సినిమా సీన్లను వాడిన సజ్జనార్, ఈ తాజాగా ఆయన విక్టరీ వెంకటేష్ కూడాను వాడేశారు. దృశ్యం సినిమాల్లో వెంకటేష్ కుటుంబసమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వీడియోను సజ్జనార్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు సజ్జనార్. ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించి, లాబాల బాట పట్టించేందుకు సజ్జవార్ చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది. #TravelInTSRTC @TSRTCHQ @VenkyMama @RanaDaggubati @SBDaggubati @baraju_SuperHit @MilagroMovies @dpveu_official @TrackTwood @iamvictoryvenky @SimranbaggaOffc @smitapop @SureshProdns #publictransport pic.twitter.com/YnPoH6MPiL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 16, 2022