SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Reason Behind Varahi Bus Yatra Not Yet Start

వారాహి రోడ్డెక్కకపోవడానికి కారణం? పవన్ కో లెక్క ఉందట!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వారాహి పేరిట బస్సు యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. పవన్‌ వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగా పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర ఆగిపోయిందా? అసలు ఏమైంది?

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 23 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వారాహి రోడ్డెక్కకపోవడానికి కారణం? పవన్ కో లెక్క ఉందట!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయపరంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. పవన్‌ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కచ్చితంగా కనపడుతుందని, పదుల సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ చేపట్టబోయే ‘వారాహి’ బస్‌ యాత్ర ద్వారా మరింత ప్రభావం ఉంటుందని అంటున్నారు. పవన్‌ ‘వారాహి’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే.. పార్టీ జెట్‌ స్పీడులో ప్రజల్లోకి దూసుకెళుతుందని అంటున్నారు. కానీ, పవన్‌ ‘వారాహి’ యాత్రపై సందిగ్ధత నెలకొంది. వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్‌ మీడియా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. పవన్‌ తన వారాహిని ఇంకా బయటకు తీసుకురాకపోవటానికి ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే..

టీచర్స్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం 

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న ఈ తరుణంలో.. ప్రభుత్వంపై ఉద్యోగులకు అసంతృప్తి బాగా పెరిగిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని ఉద్యోగులు భావిస్తున్నారట. రాష్ట్రంలో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఓ ఎమ్మెల్సీ స్థానం కాగా.. రెండోది కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలకు సంబంధించింది. ఈ ఎన్నికల ద్వారా రాయలసీమలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ ఎన్నికల్ని అధికార పార్టీ కీలకంగా భావిస్తోందట. ఈ ఎన్నికల్లో పాజిటివ్‌ ఫలితాలు వస్తే.. అది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కూడా ప్లస్‌ అవుతుందని భావిస్తోందట.  ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోందట.

ఇక, పట్టభద్రుల ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం మూడు పట్ట భద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఏపీలో ఉద్యోగాల కల్పన విషయంలో.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్‌ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి, పట్టభద్రుల్లో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉంటారు. నిరుద్యోగులు ఉంటారు. వీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేకపోలేది. వీరిని దృష్టిలో పెట్టుకుని కూడా అధికార పార్టీ ముందుకు వెళుతోందట. వీరిని మంచి చేసుకునే పనిలో పడ్డారంట స్థానిక నేతలు.

 ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే వారాహి యాత్ర!

ఇక, పవన్‌ తన వారాహి యాత్రను ఇంకా ప్రారంభించకపోవటానికి ప్రధాన కారణం.. ఎమ్మెల్సీ ఎన్నికలేనట. ముఖ్యంగా టీచర్స్‌, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వానికి వచ్చే ఫలితాలను బట్టి ముందడుగు వేసే ఆలోచనలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారంట. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూసి వారాహి యాత్రను ప్రారంభించనున్నారట. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు కాబట్టి.. ప్రస్తుతం ప్రభుత్వం పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో టీచర్స్‌ ఎన్నికల ద్వారా తేలిపోతుందని పవన్‌ భావిస్తున్నారట. నిరుద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉందని అనుకుంటున్నారట.

టీచర్స్‌, పట్టభద్రులు ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే ఒకలాంటి ప్లాన్‌ను.. వ్యతిరేకంగా ఉంటే మరోలాంటి ప్లాన్‌తో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తన యాత్రను ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే.. వచ్చే ఫలితాలను బట్టి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లనున్నారట. అయితే, వారాహి యాత్ర ఆలస్యం అయ్యేకొద్ది అభిమానుల్లో, జనసేన కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ ఎంత తొందరగా వారాహి బస్సు యాత్రను ప్రారంభిస్తే అంత మంచిదని అంటున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కాగా 3 పట్టభద్రులు స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే వారాహి బస్‌ యాత్ర మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి, వారాహి యాత్రకు బ్రేక్‌ ఇవ్వటంలో.. పవన్‌ కల్యాణ్‌ మాస్టర్‌ ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • janasena
  • Pawan Kalyan
  • political news
  • Varahi
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam