ఇండియాలోని బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీ బ్యాంకు అకౌంట్ కేవైసీ(Know Your Customer) ప్రాసెస్ కరెక్ట్ గా పూర్తి చేసారా లేదా ఓసారి చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవంటుంది RBI. కేవైసీ ప్రక్రియను పూర్తిచేయని బ్యాంకు ఖాతాలు 2022 జనవరి 1 నుండి పనిచేయవని ప్రకటించింది. ఆర్బీఐ తాజా నిబంధనల మేరకు.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పక్కాగా కేవైసీ రూల్స్ను అనుసరించాల్సి ఉంటుంది. అందువల్లే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్ల కేవైసీ వివరాలను క్రమం తప్పకుండా లిమిటెడ్ టైంలో అప్డేట్ చేస్తుంటాయి. అందులో భాగంగానే ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కేవైసీ ప్రక్రియను పూర్తిచేస్తాయి.
జనవరి 1 నుండి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న బ్యాంక్ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కొన్ని ఖాతాలకు కేవైసీ ఎక్స్పైరీ అయిపోవడం లేదా పెండింగ్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే మంచిదని ఆర్బీఐ సూచిస్తుంది. ఈ ఏడాది మే నెలలోనే కేవైసీ ప్రక్రియ గురించి బ్యాంకులన్నింటికీ ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే కోవిడ్ కారణంగా కేవైసీ అప్డేట్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల చివరితో ఆ ఆదేశాలకు గడువు పూర్తవుతుంది. కాబట్టి జనవరి 1 తర్వాత బ్యాంకులు కేవైసీ అప్డేట్ లేని అకౌంట్లను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది.ఈ కేవైసీ నిబంధనలను బ్యాంకులు మాత్రమే కాదు. ఫైనాన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకింగ్ హౌస్లు, డిపాజిటరీస్ లాంటివి కూడా అనుసరించాల్సిందే. యాంటీ మనీ ల్యాండరింగ్ చట్టాలకు అనుగుణంగా కస్టమర్లు కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేసేందుకు వీడియో కేవైసీ, డిజి లాకర్ ద్వారా డాక్యుమెంట్ల షేరింగ్, నేరుగా బ్యాంకుకి వెళ్లే మార్గాలున్నాయి. కొన్నిసార్లు కేవైసీ పేరుతో భారీ మోసాలు(సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ సైట్లు, లింకులు, మేసేజ్) జరుగుతుంటాయి. ఈ కేవైసీ ప్రక్రియలో అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు నిపుణులు.