ఈ మద్య గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఎన్ని రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడం పోలీసులకు పట్టుబడటం జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో పోలీసులను తప్పించుకొని ఎర్రచందనం దుంగల లోడ్ ని ఓ బావిలోకి పోనివ్వడం చూశాం.. ఇప్పుడు అచ్చం అలాంటి సీన్ రంపచోడవరంలో జరిగింది. సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు చేజింగ్ చేసి మరీ పట్టుకున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకోబోయి తమ వాహనాన్ని ఓ చెరువులోకి పోనిచ్చారు. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. గంజాయి స్మగ్లర్లు పక్కా ప్లాన్ తో నిర్మానుశ్యంగా ఉన్న ప్రదేశం నుంచి వస్తున్నట్లు గమనించి పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని తప్పించుకునే క్రమంలో ఓ చెరువులోకి కారును అతివేగంగా పోనిచ్చారు. కానీ, స్మగ్లర్లు కారు లో నుంచి బయటకు రాలేకపోయారు. ఇక చెరువులోకి దిగి పోలీసులు ఇద్దరిన అరెస్ట్ చేశారు.
కారులో ఉన్న బస్తాలను బయటకు తీసిన పోలీసులు అందులో దాదాపు ఐదు వందల కిలో గంజాయి ఉన్నట్లు తేల్చారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. క్రేన్ సహాయంతో కారు ని బయటకు తీయాలని చూశారు.. కానీ పట్టు తప్పి మళ్లీ కారు చెరువులోకి దూసుకు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.