మలయాళ నటుడు పృథ్వీరాజ్ – కథానాయకుడిగా సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో అలరించాడు . ఆయన ‘లూసీఫర్’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మోహన్లాల్ కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయాన్ని అందుకుంది. పృథ్వీ ఇప్పుడు తన దర్శకత్వంలో మోహన్లాల్తో మరో చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ‘బ్రోడాడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. తన నెక్ట్స్ మూవీ ‘బ్రోడాడీ’లో లాలెట్టన్ నటిస్తున్నాడంటూ ట్వీట్ చేశాడు పృథ్వీరాజ్. మల్లూవుడ్ లో మోహన్ లాల్ ని ‘లాలెట్టన్’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. మొదటి చిత్రం ‘లూసిఫర్’ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఎమోషనల్ డ్రామా కాగా ఈసారి టాలెంటెడ్ డైరెక్టర్ ఫన్ ఫ్యామిలీ డ్రామాపైన దృష్టి సారించాడు. మిగతా నటీనటులు ఇంకా తెలియాల్సి ఉంది.
మోహన్ లాల్ నెక్ట్స్ పెద్ద తెరపై కనిపించబోయే చిత్రం ‘మరక్కర్’. విడుదలకి ముందే జాతీయ అవార్డ్ స్వంతం చేసుకున్న పీరియాడికల్ ఫిల్మ్ ఆగస్ట్ 12న బాక్సాఫీస్ వద్దకి రాబోతోంది. 2020లోనే రావాల్సి ఉండగా 2021లోనూ లాక్ డౌన్ వల్ల ‘మరక్కర్’ విడుదల వాయిదా పడింది. ‘ఆదుజీవితం’ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన నటుడు పృథ్వీరాజ్, దర్శకుడు బ్లెస్సీతో పాటు 58 మంది చిత్ర బృందం లాక్డౌన్ కారణంగా జోర్డాన్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ బిగ్ బడ్జెట్ మూవీ ఓనమ్ పండుగ సందర్భంగానైనా ప్రేక్షకుల ముందుకి వస్తుందో… లేదో…వెయిట్ అండ్ సీ!
My 2nd directorial. #BRODADDY will once again be headlined by The Lalettan @Mohanlal , with an ensemble cast including yours truly. Produced by #AntonyPerumbavoor (#AashirvadCinemas), a fun family drama that makes you smile, laugh & want to revisit. Rolling soon. Very soon. 😊 pic.twitter.com/uNW75kUciP
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 18, 2021