టెక్నాలజీ డెస్క్- ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ ప్లస్ న్యూ సిరీస్ టీవీలను భారత్ లో లాంచ్ చేసింది. వన్ ప్లస్ టీవీ యూ1ఎస్ పేరుతో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. మొత్తం మూడు సైజుల్లో ఈ టీవీలను లాంచ్ చేసింది వన్ ప్లస్. 4కే డిస్ప్లేతో 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. హెచ్డీఆర్10+, హెచ్ఎల్జీ, ఎంఈఎంసీ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. 30W అవుట్ పుట్ స్పీకర్లను ఈ యూ1ఎస్ సిరీస్ టీవీల్లో అమర్చారు.
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ టీవీల్లో 4కే రిజల్యూషన్ ఉన్న స్క్రీన్లను అందించారు. నాయిస్ రిడక్షన్, ఎంఈఎంసీ, ఎఫ్సీసీ, సూపర్ రిజల్యూషన్ వంటి సినిమాటిక్ అనుభవాన్ని అందించే ఫీచర్లను పొందుపరిచారు. హెచ్డీఆర్10+ సపోర్ట్ తో పాటు, 30W సౌండ్ అవుట్పుట్ తో అద్భుతమైన డాల్బీ ఆడియో ఫీచర్ ఉంది. మొత్తం మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, ఒక ఎథర్ నెట్ జాక్ కూడా యూ1ఎస్ సిరీస్ టీవీస్సో అందించారు. హెచ్డీఎంఐ 2.1, ఈఆర్క్ ఫీచర్ను పొందుపరిచారు. అంతే కాదు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్లు ఉండటంతో నేరుగా వాయిస్ కమాండ్లను కూడా వీటి ద్వారా ఆధేశించవచ్చు.
ఇక ఈ టీవీల్లో డేటా సేవర్ మోడ్ కూడా పొందుపరిచారు. వన్ ప్లస్ వాచ్ కంట్రోల్ ద్వారా మీ స్మార్ట్ వాచ్ను కూడా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ అలెక్సాను ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. దీంతో పాటు ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ ఉన్న వన్ ప్లస్ టీవీ కెమెరాను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో యూఎస్బీ టైప్ సీ పోర్టును అమర్చారు. ఇక ధర విషయానికి వస్తే 50 అంగుళాల వేరియంట్ ధరను 39,999 రూపాయలుగా ఉంది. 55 అంగుళాల వేరియంట్ ధర 47,999 రూపాయలుగానూ, 65 అంగుళాల వేరియంట్ ధర 62,999 రూపాయలుగా నిర్ణయించారు.
రెడ్ కేబుల్ ప్లస్, ఫ్లిప్ కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ టీవీ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. మిగిలిన వారందరికీ జూన్ 11వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. ఐతే వన్ ప్లస్ టీవీ కెమెరా మాడ్యూల్ను అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధరను 2,499 రూపాయలుగా నిర్ణయించారు.