అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కూడా కొందరు పని చేయడానికి ఆసక్తి చూపించారు. అలానే చిన్న చిన్న అపజయాలకే మానసికంగా కుంగిపోతుంటారు. ఇతరుల కష్టార్జీతంపై ఆధారపడకుండా రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ దివ్యాంగ వ్యక్తి.
అవయవాలన్నీ సరిగ్గా ఉన్నా కూడా కొందరు పని చేయడానికి ఇష్టపడరు. అంతేకాక జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడుతూ తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. ఇలా ఆత్మవిశ్వాసం కోల్పోయి కొందరు సోమరులుగా ఇంట్లోనే కాలక్షేపం చేస్తుటారు. మరికొందరు ఆత్మహత్యలు వంటివాటి పాల్పడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇలాంటి యువతకు ఓ యువకుడు స్ఫూర్తిగా నిలిచాడు. పగలు డెలివరీ బాయ్ గా , రాత్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇందులో వింత ఏముందనే కదా? మీ సందేహం. అతడు అందరిలా మాములు వ్యక్తి కాదు.. ఓ దివ్యాంగుడు. భిక్షాటన మానేసి.. ఇలా రేయింబవళ్లు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి.. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆ వ్యక్తి పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రం మంగళూరు చెందిన పరశురాం దివ్వాంగుడు. విజయపుర నగరానికి చెందిన వీరి కుటుంబం 30 ఏళ్ల క్రితం మంగుళూరు వచ్చి స్థిరపడింది. ఏడుగురు సంతానంలో పరశురాం పెద్దవాడు. పరశురాంకు పుట్టుకతోనే రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. అయినా చేతులతోనే అన్ని పనులు ఎంతో చురుకుగా చేసుకునేవాడు. అంగవైకల్యం ఉన్నాకూడా 9వ తరగతి వరకు విద్యను కొనసాగించాడు. ఆ తరువాత ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పరశురాం పాఠశాలకు వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలో మొదట్లో భిక్షాటనం చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. అలా యాచించడం ద్వారా వచ్చిన డబ్బులను ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేవాడు.
అయితే భిక్షాటన సమయంలో ప్రజలు చూపే చులకన భావన అతడి మనస్సును కలచి వేసింది. వైకల్యం తన శరీరానికే కాని తనకు కాదని బలంగా నమ్మాడు. సమాజంలో గౌరవంగా బతకాలని నిర్ణయించుకుని భిక్షాటనను వదిలేశాడు. కష్టపడి పనిచేసుకుని బతికేందుకు ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే పరశురాంకి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం దొరికింది. అలా భిక్షాటన మానేసి పరశురాం సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించడం మొదలు పెట్టాడు. ఇంకా తాను కష్టపడి కుటుంబాన్ని ఆర్థిక భరోసా ఇవ్వాలని అతడు సంకల్పించాడు.ఈ క్రమంలో స్విగ్గీలో డెలివరీ బాయ్ గా చేరాడు. పగలు డెలివరీ బాయ్ గా.. సాయంత్రం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నాడు.
ఫుడ్ ఆర్డర్ తీసుకున్న తరువాత అతడు ట్రై సైకిల్ బైక్ పై డెలివరీ చేయాల్సిన ప్రాంతానికి వెళ్తాడు. అలానే ఒకవేళ అపార్ట్ మెంట్ లోకి వెళ్లాల్సి వస్తే లిఫ్ట్ లో వెళ్తాడు. అలాంటివి లేని పరిస్థితులు కస్టమర్ కి ఫోన్ చేసి కిందకు రావాలని అభ్యర్థిస్తాడు. ఈ ఉద్యోగం కోసం పరశురాం సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేశాడు. కానీ అది కొన్ని రోజులకే పాడైపోయింది. అయితే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం అతడికి మూడు చక్రాల వాహనాన్ని అందించింది. ప్రస్తుతం ఆ వాహనం సాయంతో అతడు ఫుట్ డెలివరీలు చేస్తున్నాడు. ఇలా రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి.. సోమరులుగా ఉన్న కొందరు యువతకు పరశురాం ఆదర్శం. అలానే అపజయాలు కలిగినప్పుడు కొందరు నిరాశ, నిస్పృహలతో అల్లాడిపోతుంటారు. అలాంటి వారికి పరశురాం జీవితం స్ఫూర్తి నింపుతుంది.