పిల్లలు లేక బాధపడుతున్న ఆమెకు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పద్దుతులు ఆమెకు వరంగా మారాయి. ఎన్నో ఏళ్ల నుంచి తల్లి కావాలన్న తన కోరికను నెరవేర్చాయి. 58 ఏళ్ల వయసులో పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది.
వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మానవుల అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలు లేని వారికి సంతాన భాగ్యాన్ని కలిగించే ఐవిఎఫ్ వంటి ఆధునికి వైద్య పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొన్ని ఆనారోగ్య సమస్యల వల్ల సంతానం పొందలేని వారు ఐవిఎఫ్ పద్దతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. అయితే మహిళలకు 30 ఏళ్ల వయసు వరకు పిల్లల్ని కనేందుకు అనుకూల సమయంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కొన్ని ఆరోగ్య కారణాల వల్ల పిల్లలు కలగడం ఆలస్యమవుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోబోయే మహిళ 58 ఏళ్ల వయసులో తల్లైంది. తల్లి కావాలన్న తన కోరికను తీర్చుకుంది. కవల పిల్లలు జన్మించడంతో సంతోషంలో మునిగి పోయింది.
పెళ్లైన ప్రతి మహిళ మాతృత్వాన్ని పొందేందుకు ఎన్నో కలలుకంటుంది. పిల్లలు కలగాలని, అమ్మా అని పిలుపించుకోవాలని ఆరాట పడుతుంది. ఇదే కోవలో ఓ 58 ఏళ్ల వయసున్న సంతానం లేని మహిళ సంతానం పొందాలని అనుకుంది. పిల్లలు లేని ఆమె సొసైటీలో చిన్న చూపుకుగురైంది. దీంతో ఆమె వైద్యురాలిని సంప్రదించింది. ఆ వృద్ధ మహిళకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్ పద్దతిలో సంతానాన్ని కలిగించారు. వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘట్టంగా చరిత్ర సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే…
రాజస్థాన్ కు చెందిన 58 ఏళ్ల వయసున్న షేరా బహదూర్ కు సంతానం లేదు. పిల్లలు లేరని మనోవేధనకు గురవుతుండేది. అయితే వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పద్దతుల ద్వారా సంతానం పొందవచ్చునని తెలుసుకుంది. దీంతో ఆమె బికనీర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ షెఫాలిని కలిసింది. ఆ మహిళకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఐవిఎఫ్ సక్సెస్ కావడంతో 58 ఏళ్ల మహిళ పండంటి కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక పాప ఒక బాబు ఉన్నారు. తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లి కావాలన్న తన కోరిక నెరవేరడంతో ఆ మహిళ, వారి కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.