సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. ప్రతి విషయంలో ఇద్దరికి ఎక్కడో అక్కడ తేడాలు రావడం.. గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అత్తా కోడలు కలిసి మెలిసి చాలా కాలం ఒకే ఇంట్లో ఉండేవారు. తమ ఇంటికి వచ్చిన కోడలిని కన్న కూతురులా చూసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రతి చిన్న విషయంలో ఇద్దరి మధ్య భేదాలు రావడం.. గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం. అందుకే పెళ్లైన కొంతకాలానికే అత్త నుంచి విడిపోయి వేరు కాపురం పెడుతుంటారు కోడళ్ళు. ఇది సమాజంలో సర్వసాధారం అయ్యింది. ఎక్కడో అక్కడ చాలా అరుదుగా అత్తా కోడళ్లు కలిసి ఉంటున్నారు. తాజాగా ఓ కోడలు తన అత్తను కన్నతల్లిగా భావించి తలకొరివి పెట్టింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో చాలా కుటుంబాల్లో అత్తా కోడళ్లు కలిసి ఉంటున్న పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి పెద్దదిగా మారిపోతుంటాయి. దీంతో అత్త నుంచి కోడలు వేరు కాపురాలు పెట్టుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. అలాంటిది ఓ కోడలు తన అత్తను కన్నతల్లిగా చూడటమే కాదు.. చనిపోతే తలకొరివి పట్టి అంత్యక్రియలు జరిపించింది. గుండెలు కదిలించే ఈ సంఘటన జిల్లా కొత్తగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం పట్టణంలోని రుద్రంపూర్ లో బుర్ర తిరుపతమ్మ నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు సురేష్ సింగరేణిలో జాబ్ చేస్తూ ఆరు సంవత్సరాల క్రితం చనిపోయాడు. కొడుకు కోల్పోయి తల్లి, భర్త కోల్పోయి భార్య ఒంటరి కావడంతో.. అత్తతోనే ఉంటూ వస్తుంది కోడలు సంధ్య.
తిరుపతమ్మను అత్తగా కాకుండా తల్లిగా భావిస్తూ.. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తూ దగ్గరుండి చూసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆగస్టు 9న కన్నుమూసింది. అత్తను తల్లిలా చూసుకుంటూ వచ్చిన సంధ్య ఆమె మరణాంతరం హింధూ ధర్మశాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది.. అంతేకాదు కొడుకు స్థానంలో నిలబడి అత్తకు తలకొరివి పెట్టింది. బంధాలు, బంధుత్వాలకు ఏమాత్రం విలువ లేని ఈ కాలంలో కోడలు అయి ఉండి కన్నబిడ్డలా అత్తకు సపర్యలు చేయడమే కాదు.. ఆమెకు తలకొరిమి పెట్టి కొడుకులా బాధ్యతలు నెరవేర్చడానికి సంబంధించిన ఈ ఘటన కుటుంబ వ్యవస్థలోని బాధ్యతలను గుర్తు చేస్తుందని అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.