మాదకద్రవ్యాలు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను విదేశాల నుండి తెచ్చేందుకు స్మగ్లర్లు, కొంత మంది రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఇక్కడ అధికారుల కళ్లు కప్పి మార్కెట్ చేసుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గతంలో చెప్పుల అడుగు భాగాన, కడుపులో బంగారం, మాదక ద్రవ్యాలు తీసుకెళుతూ దొరికిన ఘటనల గురించి విన్నాం. తాజా ఓ వ్యక్తి సుమారు రెండు కేజీల బంగారాన్నితీసుకెళుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడుు. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లపురానికి చెందిన అబ్దుల్ అనే ప్రయాణీకుడు.. కువైట్ నుండి ఇండిగో ఫ్లైట్ లో ఆదివారం కొచ్చిన్ చేరుకున్నాడు. అయితే అబ్దుల్ కదలికలపై అనుమానం రావడంతో.. కస్టమ్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది అతనిని తనిఖీ చేశారు. కాలు వద్ద వెతకగా, నల్లటి టేపులతో బ్యాండేజ్ వేసుకున్నట్లు కనిపించింది. దాన్ని విప్పి చూడగా, దీర్ఘచతురస్రాకారంలో బంగారంతో చేసిన రెండు తాపడాలు కనిపించాయి. వెంటనే అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 85 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Kerala: Air Intelligence Unit (AIU) of the Customs department seized 1978.89 grams of gold worth Rs 85 lakhs from a passenger at Kochi airport yesterday. The passenger has been identified as Abdul, a native of Malappuram: Customs pic.twitter.com/xxeM0QZvTJ
— ANI (@ANI) January 23, 2023