ఎదిగిన కొడుపైకి పెళ్లి చేసి ఆనందంగా ఉండాలని అనుకుంటారు ప్రతీ తల్లి దండ్రులు. ఇక బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్ రవిదాస్ కుమారుడు సచిన్ కు కొన్నేళ్ల కిందట ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. భార్య భర్తలు ఇద్దరు కూడా కొంత కాలం అన్యోన్యమైన జీవితాన్ని ఆనందిస్తున్నారు. ప్రతి రోజు భర్త ఉద్యోగానికి వెళ్ళటం, రావటం జరుగుతూ భార్య భర్తలిద్దరూ కలిసి అత్తమామలతో ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ…కొడుకు ప్రతి రోజు బయటకు వీళ్ళటం చూసిన తండ్రి కామంతో తన కోడలిపై కన్ను పెట్టాడు.
కొడుకు ఇంట్లో లేకపోవటం అదునుగా భావించిన తండ్రి అందమైన కోడలిని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అలా కొన్ని రోజులు గడిచి పోయింది. తన మామ వ్యవహారం కోడలికి తెలియటంతో ఆమె కూడా మామకు జై కొట్టింది. ఇక వీళ్ళద్దరు దీంతో ఆగకుండా భర్త బయటకు వెళ్లటంతో భార్య తన మామతో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది.
పడక సుఖం కోసం భర్తను కాదని సొంత మామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భార్య. ఇలా వారి వ్యవహారం బయటకు పొక్కటంతో భర్త వరకు వెళ్ళింది. దీంతో వీళ్ళిద్దరిని మందలించే ప్రయత్నం చేసినా మార్పు అస్సలు రాలేదు. బాగా మామతో సుఖానికి అలవాటు పడ్డ కోడలు భర్తను కాస్త దూరం పెట్టసాగింది.
ఇక వీళ్లిద్దరి వ్యవహారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మామ, కోడలి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించారు ఇద్దరు. దీంతో ఎలాగైనా భర్తను అంతమొందించేందుకు మామ, కోడలు ప్రణాళికలు రచించారు. అనుకున్నట్టుగానే భర్తను హత్య చేశారు. జూలై 7వ తేదీన తండ్రి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. తరువాత మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి విషయాన్ని తప్పుదోవ పట్టించాడు. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో మామను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. పాట్నా సమీపంలోని కొద్రాకులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.