ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
దేశంలో ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు నిత్యం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం. ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల ఈ ప్రమాదాల సంఖ్య మరింత పెరిగిపోయింది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, అతి వేగం, నిద్రలేమి, సరైన ట్రేనింగ్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. తాజాగా మహరాష్ట్రలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఏకంగా నాలుగు వాహనాలను ఢీ కొట్టి దాబాలోకి దూసుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా ఇటీవల నిత్యం పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా పాటించినా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధులే జిల్లాలో జాతీయ రహదారిపై ఓ ట్రక్కు అతి వేగంగా వచ్చి మరో నాలుగు వాహనాలను ఢీ కొట్టింది. ఆ తర్వాత వేగంగా పక్కనే ఉన్న దాబాలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. దాదాపు 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలాస్నర్ గ్రామ సమీపంలో ముంబాయి – ఆగ్రా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలంలో వాతావరణం భీతావాహంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ల ద్వారా ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాధితుల్లో బస్టాప్ లో వేచి చూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని.. వారు సైతం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.