సమాజంలో చాలా మంది చదువుకుని కూడా ఉన్నత స్థితికి ఎదగలేరు. కారణం వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు. ఇక అసలు అక్షరం ముక్కరాని మహిళల గురించి చెప్పనక్కర్లేదు. కానీ ఓ మహిళ మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె అసలు చదువుకోలేదు, అందులోనూ ఆది వాసీ ప్రాంతంలో జీవనం సాగిస్తోంది. ఆమె కి ఉన్నది ఒకటే తపన.. తన కంటూ సొంత వ్యాపారం ఉండాలని. ఆ కోరికే ఆమెను ఇప్పుడు లక్షల ఆదాయం సంపాదించే స్థితికి చేర్చింది. మరి ఆమె ఎవరు. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ లోని తాపి జిల్లాలో కపూర గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ హిందుబెన్. ఈమె స్కూల్ కి వెళ్లి చదువుకోలేదు. కానీ ఆమెకున్న వ్యాపార ఆసక్తి వల్ల చాలా మంది మహిళకు స్ఫూర్తిగా నిలిచారు. హిందు బెన్ ఆయుర్వేద మూలికలతో హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నారు. 2008 లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్నట్లు హిందు బెన్ తెలిపారు. శిక్షణ అనంతరం ఈ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కొబ్బరి నూనె, ఆముదంలో కలబందా, గులాబి, ఉసిరి, లిల్లి, కరివేపాకు, ఆనపకాయ, వేప వంటి 21 రకాల మూలికలను కలిపి నూనె తయారు చేస్తుంది. హిందుబెన్ లాంటి మహిళలను శక్తివంతగా చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హిందు బెన్ ఆర్థికంగా, స్వతంత్రగా నిలదొక్కుందు.
ఈమె విజయాన్ని స్పూర్తిగా తీసుకుని తాపీ జిల్లాలోని 76 మంది మహిళలు కేవీకే సెంటర్ నుంచి శిక్షణ తీసుకున్నారు. వీరిలో 36 మంది హెయిర్ ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు. ఆయుర్వేదు మూలికలు కలిపిన ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని హిందుబెన్ తెలిపారు. ఈ హెయిర్ ఆయిల్ ని తాపీ జిల్లాతో పాటు సరిహద్దులు జిల్లాలో వినియోగదారులు ఉన్నారు. ఈ ఆయిల్ ని విదేశాలకు సైతం హిందుబెన్ ఎగుమతి చేస్తున్నారు. ఆ ఆయిల్ వ్యాపారం ద్వారా నెలకు రూ.10,000, గత మూడేళ్లలో రూ.3 లక్షల పైనే సంపాదించినట్లు బెన్ తెలిపారు. హిందుబెన్ అకింత భావం, కష్టపడే తత్వంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాందించారు. ఆమె దక్షిణ గుజరాత్ లోని చాలా మంది గిరిజన మహిళలకు స్పూర్తిగా నిలిచారు. మరి.. గిరిజన ప్రాంతంలో ఉంటూ కూడా సొంత వ్యాపారంతో ముందుకు వెళ్తున్న హిందుబెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.