మహారాష్ట్ర లోని పూణె నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. పూణే నగరంలోని ఎరవాడ పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మాల్ ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
భవనం శకలాల మద్య కూలీలు ఇరుక్కుపోవడంతో కట్టర్ల సాయంతో ఐరన్ రాడ్లను కోసి కార్మికులను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు తెలిపారు. బేస్మెంట్లో అక్కడ కూలీలు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మృతుల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కొలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.
Prime Minister Narendra Modi extends his condolences to the bereaved families of those who died in the mishap at an under-construction building in Pune https://t.co/jQmpM7GNMW pic.twitter.com/qnekeOC1Bq
— ANI (@ANI) February 4, 2022