Terahvin: కుటుంబంలో ఒకరిలా పెరిగిన పెంపుడు జంతువులు చనిపోయినపుడు వాటిని పాతి పెట్టడం సహజం. అదే వాటి మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ ప్రేమ పెరిగే కొద్దీ వాటికి ఇచ్చే మర్యాదలో కూడా తేడా ఉంటుంది. ఓ మనిషి చనిపోతే ఎలాంటి ఆచారాల్ని పాటిస్తారో పెంపుడు జంతువులు చనిపోయినపుడు కూడా అలాంటివి పాటిస్తారు. తాజాగా, ఓ కుటుంబం తమ పెంపుడు కోడి పుంజుకు ఘనంగా దశ దినకర్మ నిర్వహించింది. ఇలా చేయటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే..
ఉత్తర ప్రదేశ్, ప్రతాప్ ఘర్ జిల్లా బెహ్దౌల్ కాలా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఓ కోడిపుంజును పెంచుకుంటోంది. ఆ కుటుంబం దానికి లాలి అని పేరు కూడా పెట్టింది. ఆ కుటుంబానికి కోడి పుంజుతో పాటు కొన్ని గేదెలు కూడా ఉన్నాయి. ఈ మధ్యే ఓ గేదె ఈనింది. జులై 7వ తేదీన దూడ తల్లితో పాటు ఇంటి వెనకాల ఉన్న స్థలంలో ఉంది. ఆ టైంలో ఓ వీధి కుక్క అక్కడికి వచ్చింది. దూడ మీద దాడి చేయబోయింది. అక్కడే దూడకు కాపలాగా ఉన్న లాలి కుక్కకు ఎదురెళ్లింది. దానిపై దాడి చేసి ఇంటి బయటకు తరిమింది.
అయితే, ఇంటి బయట ఉన్న మరికొన్ని వీధి కుక్కలు లాలిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లాలి జులై 8న కన్నుమూసింది. దూడను కాపాడ్డం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న లాలికి కుటుంసభ్యులు ఎంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాదు! లాలికి దశ దినకర్మ కూడా నిర్వహించాలని భావించారు. తాజాగా, ఎంతో ఘనంగా దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : MBA chai wala: చాయ్ వాలా సంపాదన అక్షరాల రూ.4 కోట్లు!