రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. దీంతో తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతోమంది ఉక్రెయిన్ పౌరులు సైన్యంలో చేరి రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టి దేశాన్ని కాపాడుకుంటున్నారు. అయితే, ఆ దేశాన్ని కాపాడేందుకు ఉక్రెయిన్ వాసులతో పాటు తమిళనాడుకు చెందిన వ్యక్తి కూడా జాయిన్ అయ్యాడు. చదువుకునేందుకు అక్కడికి వెళ్లి..అక్కడి సైన్యంతో కలిసి రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ది తమిళనాడుకు చెందిన కోయంబత్తూరు. సాయినికేష్ ప్రస్తుతం ఉక్రెయిన్ ఆర్మీలో చేరి రష్యా సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. నిజానికి సాయి నికేష్కు ఇండియన్ ఆర్మీలో చేరాలని కోరిక. దానికోసం అప్లయ్ కూడా చేశాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇక్కడ సెలక్ట్ కాలేదు. దీంతో 2018లో ఖార్కీవ్లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చేరాడు. ఈ ఏడాది జూలై నాటికి తన ఈ కోర్సును పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఈ లోపు అక్కడ యుద్ధం మొదలుకావడంతో సైన్యంలో చేరాలనే తన కల నేరవేర్చుకున్నాడు సాయి నికేశ్.
యుద్ధం మొదలైనప్పటి నుంచి.. సాయినికేశ్ అతని కుటుంబంతో కాంటాక్ట్లో లేడు. కాగా.. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిగా వారు సాయినికేష్ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా.. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు ఇండియాలోని అధికారులకు కూడా వెల్లడించారు. మరి ఉక్రెయిన్ సైన్యంలో చేరిన మన భారతీయ విద్యార్థిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.