ఘోర విషాదం వెలుగు చూసింది. చక్కగా చదువుకుని డాక్టర్ కావాలని కలలుకన్నాడు. నీట్ లో విజయం సాధించేందుకు కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. కానీ, తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అన్నట్లుగా అతని జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. డాక్టరు అయ్యి నలుగురు ప్రాణాలు కాపాడాలనుకున్న కుర్రాడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. హాస్టల్ లో ఆరో అంతస్థు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రం జవహర్ నగర్ ప్రాంతంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇషాన్షు భట్టాచార్య నీట్ కంప్లీట్ చేసి మెడికల్ చదవాలి అనుకున్నాడు. అందుకోసం జవహర్ నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే అతను ఉంటున్న ఆరో అంతస్థు బాల్కనీ నుంచి కిదపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన హాస్టర్ సీసీటీవీలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి.. సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన తర్వాత పోలీసులు అతను బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే కిందపడినట్లు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో తన ముగ్గురు మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. అందరూ బాల్కనీలో మాట్లాడుకుని వెళ్తుండగా.. ఇషాన్షు చెప్పులు వేసుకోబోతూ వెనక్కి వాలాడు. అయితే అతను అలా వాలగనే అక్కడున్న సిల్వర్ కలర్ రెయిలింగ్ ఊడిపోయింది. అతను అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు ధ్రువీకరించారు. ఈ ఘనటపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Kota: Student dies after falling from sixth floor of hostel; probe on.#Kota pic.twitter.com/LPuENsi7hK
— TIMES NOW (@TimesNow) February 3, 2023