ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పరిమాణాలు పాటించడంలేదని ఫిర్యాదులు వస్తున్నా.. సిబ్బందిలో మాత్రం మార్పుడు రావడం లేదు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వారికి పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ కొంతమంది స్వార్థపరులు మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో స్కాములు చేస్తూ అధికారులకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు వంటవాళ్ల నిర్లక్ష్యం వల్ల తినే ఆహారంలో పురుగులు, బల్లులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ పాఠశాల విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కలకం సృష్టించింది. ఈ ఘటన బీహార్ అరారియా జిల్లాలో చోటు చేసుకుంది.
బీహార్ లోని ఫర్బిస్గంజ్ సబ్డివిజన్ జోగ్బాని మున్సిపల్ కౌన్సిల్కు చెందిన అమౌనా సెకండరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకున్నారు. పిల్లలు ఒక్కసారిగా ఎందుకు వాంతులు చేసుకున్నారన్న విషయం పరిశీలించగా భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం 100 మందికి పైగా చిన్నారులు ఆహారం తిన్నారు.. అందులో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్ దీనిని సరఫరా చేశారని సిబ్బంది చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొద్ది సేపు పాఠశాల వద్ద ఆందోళన చే ప్రస్తుతం చిన్నారులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఉన్నత కమిటీ తో విచారణ చేయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్ డివిజినల్ అధికారి సురేంద్ర అల్బేలా మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనంలో పాము వచ్చింది.. అది ఎలా వచ్చింది అనేది గుర్తించాల్సి ఉంది. దీనిపై విచారణ జరిపిస్తున్నాం. ఈ ఘటనలో 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.. ప్రస్తుతం చిన్నారు బాగానే ఉన్నారు. వారి ఆరోగ్య విషయంలో పుకార్లు నమ్మవొద్దని అన్నారు.