ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎందరో రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా పట్టుదలతో శ్రమించిన కూడా కొందరిని మాత్రమే సర్కార్ కొలువులు వరిస్తాయి. ఇలా ఉద్యోగం పొందిన వాళ్లలో చాలా మంది నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తుంటారు. ప్రభుత్వ ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతిదీ వచ్చేలా చేస్తుంటారు. అయితే ఈ ప్రభుత్వ కొలువుల్లో కొందరు అవినీతి సొమ్ముకు అలవాటు పడి.. అందులోనే మునిగి తేలుతుంటారు. రాజకీయ నాయకల ముందు, ఇతర పెద్ద అధికారుల ముందు కుక్కలాగా ఉండే వాళ్లు.. డబ్బు కోసం ప్రజలను మాత్రం రాబందుల్లా పట్టి పీడిస్తుంటారు. తాజాగా ఓ ఎస్సై కూడా ఓ రైతు నుంచి లంచం అడిగాడు. ఆ రైతు కొంత సొమ్ము ఇవ్వగా.. మరికొంత కావాలని ఆ అవినీతి ఎస్సై డిమాండ్ చేశాడు. ఇక ఆ అవినీతి ఖాకీ ఆగడనలు భరించలేని సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటూ ఆ ఎస్సై దొరికిపోయాడు. అయితే అదే సమయంలో ఆధారాలు లేకుండా చేసేందుకు నోట్లను మింగేసే యత్నం చేశాడు. అతడి ప్రయత్నాన్ని ఏసీపీ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ ప్రాంతాన్నికి చెందిన సుభ్నత్ అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల అతడి గేదెను ఎవరో దొంగిలించారు. దీంతో ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సుభ్నత్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై మహేంద్ర .. సుభ్నత్ ను లంచం అడిగాడు. ఫిర్యాదు స్వీకరించి..గేదెను పట్టించాలంటే రూ.15 వేలు సమర్పించుకోవాల్సిందేనని సదరు ఎస్సై డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో చేసేది ఏమిలేక.. రూ.6 వేలు ఎస్సైకి సమర్పించుకున్నాడు. అయితే మిగతా నాలుగు వేలు కూడా ఇస్తేనే కేసు సంగతి చూస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. సామాన్యులను కూడా జలగలా పట్టి పీడిస్తోన్న ఈ ఎస్సైకి ఎలాగైన బుద్ధి చెప్పాలని సుభ్నత్ భావించాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
వారు చెప్పిన పథకం ప్రకారం.. అతడు మిగతా రూ. 4 వేలు కూడా తెచ్చి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు అకస్మిక దాడితో ఒక్క క్షణం పాటు షాకైన ఎస్సై..తేరుకుని ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. తాను లంచం తీసుకున్నట్లు ఆధారాలు లేకుండా చేసేందుకు రైతు ఇచ్చిన డబ్బులను మింగేసే ప్రయత్నం చేస్తూ నోటిలోకి కుక్కేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఎస్సై నోట్లోకి వెళ్లిన నోట్లను బయటకు తీసేందుకు తెగ ప్రయత్నించారు. అయితే కొన్ని కిందపడిపోయినప్పటికి మరికొన్ని నోట్లను అతడు మింగేశాడు. దీంతో ఎస్సైని తమ వాహనంలో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
@HaryanaPolice27 cop caught red handed taking bribe at Faridabad. swallows bribe money @cmohry pic.twitter.com/bjEYYrr4LQ
— Sushil Manav (@sushilmanav) December 13, 2022